BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

తిమ్మాపురం మోడల్ స్కూల్ లో ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకారణం ప్రక్రియ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
31 Mar, 2026 - 01:39 AM
226 వీక్షణలు

తిమ్మాపురం మోడల్ స్కూల్ లో ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం

స్థానిక తిమ్మాపురం ఆదర్శ పాఠశాల (AP Model School) లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాల కొరకు నోటిఫికేషన్ విడుదలైనట్లు ప్రిన్సిపాల్ లక్ష్మణరావు తెలిపారు. పదవ తరగతిలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఇంగ్లీష్ మీడియం లో ఎంపిసి, బైపిసి, ఎంఈసీ మరియు సీఈసీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించబడతాయన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఏప్రిల్ 30, 2026 లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ ప్రవేశ ప్రక్రియలో ప్రభుత్వం నిర్దేశించిన రిజర్వేషన్ నిబంధనలు ప్రకారం సీట్లు కేటాయించబడతాయి. ఎంపికైన విద్యార్థుల జాబితాను మే 5న ప్రకటించి, మే 6న ధృవీకరణ పత్రాల పరిశీలన చేపడతారని తెలిపారు.ఈ పాఠశాలలో చేరిన విద్యార్థులకు ఉచిత విద్యతో పాటు అత్యాధునిక ల్యాబ్, లైబ్రరీ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఐఐటి-జెఈఈ (IIT-JEE) మరియు నీట్ (NEET) వంటి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల కోసం 'మిషన్ మోడల్ మైండ్స్' (Mission Model Mindz) ద్వారా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. ఎటువంటి ఆఫ్-లైన్ దరఖాస్తులు స్వీకరించబడవు, కావున అభ్యర్థులు నిర్ణీత గడువులోగా ఆన్‌లైన్ లోనే దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ఓసి, బిసి విద్యార్థులకు 200 మరియు ఎస్సి, ఎస్టీ విద్యార్థులకు 150 రూపాయలుగా ప్రభుత్వం ఫీజు నిర్ణయించిందన్నారు. మరింత సమాచారం కోసం పాఠశాల కార్యాలయాన్ని సంప్రదించవచ్చన్నారు.