BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింపు.

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Mar, 2026 - 01:23 PM
64 వీక్షణలు

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింపు.. ఉచిత దర్శన టోకెన్ల జారీకి సిద్ధం

ఏడుకొండలపై వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం ప్రతిరోజూ వేలాదిమంది భక్తులు తిరుమలకు తరలివస్తుంటారు. అయితే వారాంతాలు, సెలవుల తరువాత సోమవారం భక్తుల రద్దీ గణనీయంగా తగ్గినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.

ఉదయం 8 గంటల నాటికి ఉచిత సర్వదర్శనం కోసం కేవలం 10 కంపార్టుమెంట్లలో మాత్రమే భక్తులు వేచి ఉన్నారు. వీరికి స్వామివారి దర్శనం సుమారు 8 గంటల్లో పూర్తవుతుందని అధికారులు తెలిపారు.

సర్వదర్శనం, దివ్యదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు 3–4 గంటలు, రూ.300 శీఘ్రదర్శనానికి 2–3 గంటల సమయం పడుతోంది.

గత రోజు మొత్తం 80,774 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, 27,447 మంది తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకలు సుమారు రూ.4.05 కోట్లకు చేరినట్లు టీటీడీ పేర్కొంది.

ఇప్పటికే నేటి దర్శన టికెట్లు పూర్తిగా పంపిణీ కాగా, రేపటి ఉచిత దర్శన టోకెన్లను కొద్దిసేపటిలో అలిపిరి భూదేవి కాంప్లెక్స్, విష్ణునివాసం, శ్రీనివాసం, శ్రీవారిమెట్టు వద్ద జారీ చేయనున్నారు.