BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

తిరువూరు హెడ్ కానిస్టేబుల్‌ రాజబోయిన రామచంద్ర రావు కు కేంద్ర సత్కారం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Mar, 2026 - 10:18 PM
190 వీక్షణలు

తిరువూరు హెడ్ కానిస్టేబుల్‌ రాజబోయిన రామచంద్ర రావు కు కేంద్ర సత్కారం

తిరువూరు పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రాజబోయిన రామచంద్రరావు పేరు ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. కేవలం విధులు నిర్వహించడమే కాకుండా, ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించిన ఈ పోలీస్ అధికారి సేవలకు కేంద్ర ప్రభుత్వం “ఉత్తిష్ట సేవ పథకం” కింద గౌరవం ప్రకటించడం విశేషం.

కులమతాలకు, రాజకీయాలకు అతీతంగా అందరికీ అండగా నిలిచే రామచంద్రరావు… సమస్య వచ్చినప్పుడల్లా ముందుండే పోలీస్‌గా ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. గ్రామాల నుంచి పట్టణాల వరకూ ఆయన సేవల గురించి మాట్లాడుకుంటున్నారు.

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని చాట్రాయి మండలం బూరుగుగూడెం గ్రామానికి చెందిన రామచంద్రరావు… వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి, కష్టపడుతూ కానిస్టేబుల్‌గా ప్రారంభించి, హెడ్ కానిస్టేబుల్‌గా ఎదిగిన ప్రయాణం చాలా మందికి ప్రేరణగా నిలుస్తోంది.

“మన ఊరి వ్యక్తి దేశ స్థాయిలో గుర్తింపు పొందడం గర్వకారణం” అంటూ స్వగ్రామ ప్రజలు సంబరాలు జరుపుకుంటున్నారు. ఆయనకు వచ్చిన ఈ గౌరవం భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాలకు దారి తీస్తుందని స్థానికులు భావిస్తున్నారు.

పోలీస్ డ్రెస్‌లో సేవ… ప్రజల గుండెల్లో స్థానం – ఇదే రామచంద్రరావు స్టోరీ!