తిరువూరు హెడ్ కానిస్టేబుల్ రాజబోయిన రామచంద్ర రావు కు కేంద్ర సత్కారం
తిరువూరు హెడ్ కానిస్టేబుల్ రాజబోయిన రామచంద్ర రావు కు కేంద్ర సత్కారం
తిరువూరు పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న రాజబోయిన రామచంద్రరావు పేరు ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. కేవలం విధులు నిర్వహించడమే కాకుండా, ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించిన ఈ పోలీస్ అధికారి సేవలకు కేంద్ర ప్రభుత్వం “ఉత్తిష్ట సేవ పథకం” కింద గౌరవం ప్రకటించడం విశేషం.
కులమతాలకు, రాజకీయాలకు అతీతంగా అందరికీ అండగా నిలిచే రామచంద్రరావు… సమస్య వచ్చినప్పుడల్లా ముందుండే పోలీస్గా ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. గ్రామాల నుంచి పట్టణాల వరకూ ఆయన సేవల గురించి మాట్లాడుకుంటున్నారు.
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని చాట్రాయి మండలం బూరుగుగూడెం గ్రామానికి చెందిన రామచంద్రరావు… వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి, కష్టపడుతూ కానిస్టేబుల్గా ప్రారంభించి, హెడ్ కానిస్టేబుల్గా ఎదిగిన ప్రయాణం చాలా మందికి ప్రేరణగా నిలుస్తోంది.
“మన ఊరి వ్యక్తి దేశ స్థాయిలో గుర్తింపు పొందడం గర్వకారణం” అంటూ స్వగ్రామ ప్రజలు సంబరాలు జరుపుకుంటున్నారు. ఆయనకు వచ్చిన ఈ గౌరవం భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాలకు దారి తీస్తుందని స్థానికులు భావిస్తున్నారు.
పోలీస్ డ్రెస్లో సేవ… ప్రజల గుండెల్లో స్థానం – ఇదే రామచంద్రరావు స్టోరీ!