www.ntodaynews.com
తిరువూరు లో కోర్టు విధులను బహిష్కరించిన న్యాయవాదులు – అక్రమ దాడి, నిర్బంధంపై నిరసన
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు:
ఏలూరు సీనియర్ న్యాయవాది ఇడుపుగంటి శ్రీనివాస్ బాబు నివాసంపై 14-06-2026న జరిగిన అక్రమ దాడి ఘటనతో పాటు పోలీసుల అక్రమ నిర్బంధానికి నిరసనగా 17-06-2026న న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించారు.
ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు తమ ఆందోళనను వ్యక్తం చేశారు. సంఘటనకు బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సంకురాత్రి జనార్దనరావు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గోగిరెడ్డి కృష్ణారెడ్డి, జనరల్ సెక్రటరీతో పాటు పలువురు సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.