www.ntodaynews.com
తిరువూరు సబ్ రిజిస్ట్రార్ చాముండేశ్వరి దేవి మానవత్వం
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
అంధుల, వికలాంగుల ఆశ్రమానికి నిత్యావసర సరుకులు అందజేత
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణ పరిధిలోని జన్మభూమి రోడ్లో ఉన్న భగవాన్ శ్రీ రమణ మహర్షి అంధులు, వికలాంగులు, అనాథ బాలల సేవ ఆశ్రమంలో మానవతా సేవ కార్యక్రమం జరిగింది.
తిరువూరు సబ్ రిజిస్ట్రార్ చాముండేశ్వరి దేవి తన వంతు సామాజిక బాధ్యతగా ఆశ్రమాన్ని సందర్శించి నెలకు సరిపడా రెండు బియ్యం సంచులు, నిత్యావసర సరుకులు, పండ్లు, అల్పాహారాన్ని ఆశ్రమ నిర్వాహకులకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో వెంపాటి అబ్రహం మణిరత్నం, వెంపాటి సూరిబాబు, మాదాసు టైటాస్ పాల్గొన్నారు.
సహాయం అందించిన చాముండేశ్వరి దేవికి ఆశ్రమ నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆశ్రమంలోని పిల్లల అవసరాలను గుర్తించి ముందుకొచ్చిన ఈ సేవా కార్యక్రమం స్థానికంగా ప్రశంసలు పొందింది.