తిరువూరులో ఎరువుల దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు
తిరువూరులో ఎరువుల దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు
ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు: రైతులకు ఎరువుల సరఫరా సక్రమంగా జరుగుతున్నదా అనే అంశంపై తిరువూరు ఆర్డీవో ఏ. కుమార్ ఎరువులు, పురుగుమందుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
తనిఖీల సందర్భంగా యూరియా, డీఏపీతో పాటు ఇతర ఎరువుల నిల్వలు, విక్రయాల రికార్డులను పరిశీలించారు. ముఖ్యంగా యూరియా, డీఏపీ తదితర ఎరువులు తెలంగాణకు అక్రమంగా తరలించకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వ్యాపారులకు వివరించారు.
ఈ సందర్భంగా ఆర్డీవో ఏ. కుమార్ మాట్లాడుతూ, APAIMS యాప్ ద్వారా రైతుల భూ విస్తీర్ణం, పంట అవసరాలకు అనుగుణంగా మాత్రమే యూరియా పంపిణీ జరిగేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. రైతులకు అవసరమైన మేరకే ఎరువులు అందేలా పర్యవేక్షణ కొనసాగుతోందని తెలిపారు.
ఈ తనిఖీల్లో వ్యవసాయశాఖ అధికారి పి. పద్మా, ఎస్సై శాతకర్ణి తదితరులు పాల్గొన్నారు.