BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

తిరువూరులో సోమవారం వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
09 Aug, 2026 - 05:02 PM
42 వీక్షణలు

తిరువూరులో సోమవారం వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ డీఎస్సీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, నిరుద్యోగ సమస్యలపై ఆందోళన

విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్

తిరువూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేపు తిరువూరులో భారీ నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్లు పార్టీ తిరువూరు పట్టణ అధ్యక్షుడు రేగళ్ల మోహన్ రెడ్డి తెలిపారు. డీఎస్సీ పోస్టుల భర్తీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, నిరుద్యోగ భృతి, విద్యా వ్యవస్థ, ఉద్యోగాల కల్పన తదితర అంశాలపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

డీఎస్సీ నియామకాల విషయంలో అభ్యర్థులకు అన్యాయం జరిగిందని, ఫీజు రీయింబర్స్‌మెంట్ అందక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైఎస్సార్‌సీపీ నాయకులు ఆరోపించారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువత సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. విద్యా రంగాన్ని, విద్యార్థుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

తిరువూరు నియోజకవర్గ పరిధిలో డీఎస్సీ నియామకాలపై నిరాశకు గురైన అభ్యర్థులు, ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు, ఉద్యోగాల కోసం ఆశగా ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతతో పాటు వారి తల్లిదండ్రులు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అనుబంధ విభాగాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన ర్యాలీని విజయవంతం చేయాలని రేగళ్ల మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు.

తిరువూరు ఫ్యాక్టరీ సెంటర్ నుంచి ఉదయం 9 గంటలకు నిరసన ర్యాలీ ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి ప్రభుత్వంపై తమ నిరసనను తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.