తిరువూరులో రేషన్ షాప్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆర్డీఓ ఎ. కుమార్
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలోని రేషన్ షాప్ నెం. 613038ను రెవెన్యూ డివిజనల్ అధికారి ఎ. కుమార్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రేషన్ బియ్యం నాణ్యత, నిల్వలు, పంపిణీ విధానం, ఈ-పాస్ యంత్రం పనితీరు, స్టాక్ రిజిస్టర్లు, తూకం తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆర్డీఓ స్వయంగా రేషన్ బియ్యం నాణ్యతను పరిశీలించి, ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యమైన బియ్యాన్ని మాత్రమే లబ్ధిదారులకు పంపిణీ చేయాలని డీలర్కు సూచించారు. అలాగే రేషన్ కోసం వచ్చిన లబ్ధిదారులతో మాట్లాడి బియ్యం నాణ్యత, తూకం, పంపిణీ సమయాలు, బయోమెట్రిక్ సేవలపై వివరాలు తెలుసుకున్నారు.
రేషన్ షాప్లో స్టాక్ బోర్డు, ధరల పట్టిక, నిల్వల వివరాలను తప్పనిసరిగా ప్రదర్శించాలని ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు పారదర్శకంగా రేషన్ సరుకుల పంపిణీ నిర్వహించాలని, ఎలాంటి అవకతవకలు జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో నాణ్యమైన రేషన్ సరుకులు అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని ఆర్డీఓ ఎ. కుమార్ సంబంధిత అధికారులకు ఆదేశించారు.