BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

తిరువూరులో రేషన్ షాప్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆర్‌డీఓ ఎ. కుమార్

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Aug, 2026 - 03:20 PM
45 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలోని రేషన్ షాప్ నెం. 613038ను రెవెన్యూ డివిజనల్ అధికారి ఎ. కుమార్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రేషన్ బియ్యం నాణ్యత, నిల్వలు, పంపిణీ విధానం, ఈ-పాస్ యంత్రం పనితీరు, స్టాక్ రిజిస్టర్లు, తూకం తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆర్‌డీఓ స్వయంగా రేషన్ బియ్యం నాణ్యతను పరిశీలించి, ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యమైన బియ్యాన్ని మాత్రమే లబ్ధిదారులకు పంపిణీ చేయాలని డీలర్‌కు సూచించారు. అలాగే రేషన్ కోసం వచ్చిన లబ్ధిదారులతో మాట్లాడి బియ్యం నాణ్యత, తూకం, పంపిణీ సమయాలు, బయోమెట్రిక్ సేవలపై వివరాలు తెలుసుకున్నారు.

రేషన్ షాప్‌లో స్టాక్ బోర్డు, ధరల పట్టిక, నిల్వల వివరాలను తప్పనిసరిగా ప్రదర్శించాలని ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు పారదర్శకంగా రేషన్ సరుకుల పంపిణీ నిర్వహించాలని, ఎలాంటి అవకతవకలు జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో నాణ్యమైన రేషన్ సరుకులు అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని ఆర్‌డీఓ ఎ. కుమార్ సంబంధిత అధికారులకు ఆదేశించారు.