తిరువూరులో టీడీపీ మేనిఫెస్టో దహనం చేసిన నల్లగట్ల స్వామిదాస్
తిరువూరులో టీడీపీ మేనిఫెస్టో దహనం చేసిన నల్లగట్ల స్వామిదాస్
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన "వెన్నుపోటుకు రెండేళ్లు" నిరసన కార్యక్రమంలో భాగంగా తిరువూరు నియోజకవర్గ ఇన్చార్జ్ నల్లగట్ల స్వామిదాస్ టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో ప్రతులను దగ్ధం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. సూపర్ సిక్స్ సహా అనేక హామీలు ఇప్పటికీ పూర్తిస్థాయిలో అమలు కాలేదని ఆరోపించారు. ప్రజలను మోసం చేసిన టీడీపీ ప్రభుత్వంపై నిరసనగా మేనిఫెస్టోను దహనం చేస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.