తిరువూరులో ఉగాది సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేతకు ఘన సన్మానం
తిరువూరులో ఉగాది సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేతకు ఘన సన్మానం
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని తిరువూరులో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ఆర్టీసీ రామారావు (రంగినేని రామారావు) ని ఆయన పార్టీకి చేసిన విశిష్ట సేవలను గుర్తిస్తూ ఘనంగా సన్మానించారు.
తిరువూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రాజీవ్ భవన్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాయకులు రామారావు కి నూతన వస్త్రాలు బహుకరించి సత్కరించారు. పార్టీ అభివృద్ధికి ఆయన చేసిన కృషిని నాయకులు కొనియాడారు.
ఈ కార్యక్రమంలో తిరువూరు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొడ్డు ప్రకాశరావు, పట్టణ అధ్యక్షుడు జీవన్ బాబు, మండల అధ్యక్షుడు పల్లెపాటి శ్రీనివాసరావు, గంజా కృష్ణమోహన్, కొత్తగుండ్ల గోపాలకృష్ణ, కె.ఎల్. రావు, గంధం శ్రీనివాసరావు, కుంచం చందర్రావు, కుంచం దినేష్ తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో సాగగా, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై రామారావు కి శుభాకాంక్షలు తెలియజేశారు.