BREAKING
మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
www.ntodaynews.com

తక్కెళ్ళపహాడ్ అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహణ

తెలంగాణ
/ నల్గొండ / శాలిగౌరారం
Reporter
CHERUKU RAMESH శాలిగౌరారం మండల ఇన్వెస్టిగేషన్ ప్రతినిధి
04 Aug, 2026 - 05:18 PM
86 వీక్షణలు

తక్కెళ్ళపహాడ్‌లో జాతీయ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా అవగాహన కార్యక్రమం

తక్కెళ్ళపహాడ్ | NTODAY NEWS

తక్కెళ్ళపహాడ్ అంగన్‌వాడీ కేంద్రంలో జాతీయ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా అవగాహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ కట్టంగురి సురేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బిడ్డ పుట్టిన గంటలోపు తొలి ఆహారంగా ముర్రుపాలు (కొలస్ట్రం) తప్పనిసరిగా ఇవ్వాలని సూచించారు. ముర్రుపాలు శిశువుకు సహజ రోగనిరోధక శక్తిని పెంపొందించి, ఆరోగ్యవంతమైన జీవితానికి బలమైన పునాది వేస్తాయని తెలిపారు.

అనంతరం ICDS సూపర్‌వైజర్ సునీత మాట్లాడుతూ, శిశువుకు తొలి ఆరు నెలల పాటు పూర్తిగా తల్లిపాలే ఇవ్వాలని, ఆ తర్వాత తల్లిపాలతో పాటు అదనపు పోషకాహారాన్ని ప్రారంభించాలని సూచించారు. బిడ్డకు రెండు సంవత్సరాల వయస్సు వచ్చే వరకు తల్లిపాలను కొనసాగించడం వల్ల శారీరక, మానసిక ఎదుగుదలతో పాటు సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని వివరించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కట్టంగురి సురేందర్ రెడ్డి, ICDS సూపర్‌వైజర్ సునీత, అంగన్‌వాడీ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, గర్భిణీలు, బాలింతలు, గ్రామ మహిళలు పాల్గొన్నారు.