BREAKING
యోగాంధ్ర కార్యక్రమాల విజయవంత నిర్వహణకు శ్రీశైలం దేవస్థానం ప్రణాళిక బీటెక్ విద్యార్థి కిడ్నాప్ కలకలం.. చివరకు పల్నాడు జిల్లా నరసరావుపేటలో భారీ చోరీ. హోంమంత్రిపై తప్పుడు వ్యాఖ్యలు చేయడం తగదు: ఆగివున్న లారీని ఢీకొట్టిన మినీ బస్సు .. ఒకరు మృతి, 13 మందికి గాయాలు! మార్కాపురంలో రేషన్ బియ్యం మాఫియాకు భారీ షాక్.. 1922 కేజీల బియ్యం సీజ్! అంగరంగ వైభవంగా జన్మదిన వేడుకలు.... ట్రాక్టర్లకు రేడియం స్టిక్కర్లు.. రహదారి ప్రమాదాల నివారణకు నూజివీడు పోలీసుల ప్రత్యేక చర్య పుంగనూరులో తల్లిపై కుమారుడి కర్రలతో దాడి పల్లె నిద్రలో ప్రజలతో మమేకమైన ఆగిరిపల్లి పోలీసులు యోగాంధ్ర కార్యక్రమాల విజయవంత నిర్వహణకు శ్రీశైలం దేవస్థానం ప్రణాళిక బీటెక్ విద్యార్థి కిడ్నాప్ కలకలం.. చివరకు పల్నాడు జిల్లా నరసరావుపేటలో భారీ చోరీ. హోంమంత్రిపై తప్పుడు వ్యాఖ్యలు చేయడం తగదు: ఆగివున్న లారీని ఢీకొట్టిన మినీ బస్సు .. ఒకరు మృతి, 13 మందికి గాయాలు! మార్కాపురంలో రేషన్ బియ్యం మాఫియాకు భారీ షాక్.. 1922 కేజీల బియ్యం సీజ్! అంగరంగ వైభవంగా జన్మదిన వేడుకలు.... ట్రాక్టర్లకు రేడియం స్టిక్కర్లు.. రహదారి ప్రమాదాల నివారణకు నూజివీడు పోలీసుల ప్రత్యేక చర్య పుంగనూరులో తల్లిపై కుమారుడి కర్రలతో దాడి పల్లె నిద్రలో ప్రజలతో మమేకమైన ఆగిరిపల్లి పోలీసులు
www.ntodaynews.com

తల్లిదండ్రులకు రక్షణగా “పేరెంట్స్ సపోర్ట్ బిల్లు”

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Mar, 2026 - 11:20 PM
56 వీక్షణలు

తల్లిదండ్రులకు రక్షణగా “పేరెంట్స్ సపోర్ట్ బిల్లు”  తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం

హైదరాబాద్, మార్చి 23: వృద్ధ తల్లిదండ్రుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. “పేరెంట్స్ సపోర్ట్ బిల్లు”కు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కుటుంబ బాధ్యతలను నిర్లక్ష్యం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకునేలా ఈ బిల్లు రూపుదిద్దుకుంది.

ఈ బిల్లు ప్రకారం తల్లిదండ్రులను చూసుకోని ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగుల జీతాల నుంచి 15 శాతం లేదా రూ.10,000 (ఏది తక్కువైతే అది) కోత విధించి, ఆ మొత్తాన్ని వారి తల్లిదండ్రులకు అందించే విధానం అమలు చేయనున్నారు.

ఫిర్యాదుల ఆధారంగా సంబంధిత అధికారుల ద్వారా విచారణ జరిపి, నిర్లక్ష్యం నిర్ధారణ అయిన పక్షంలోనే ఈ కోత అమలు అవుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. వృద్ధుల ఆర్థిక భద్రతను బలోపేతం చేయడంతో పాటు కుటుంబ విలువలను కాపాడటం ఈ చట్టం ప్రధాన ఉద్దేశ్యంగా పేర్కొంది.

ఈ నిర్ణయంతో వృద్ధ తల్లిదండ్రులకు మరింత రక్షణ లభిస్తుందని, కుటుంబ బాధ్యతలపై సమాజంలో చైతన్యం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.