BREAKING
వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య
www.ntodaynews.com

తల్లిదండ్రులకు రక్షణగా “పేరెంట్స్ సపోర్ట్ బిల్లు”

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Mar, 2026 - 11:20 PM
92 వీక్షణలు

తల్లిదండ్రులకు రక్షణగా “పేరెంట్స్ సపోర్ట్ బిల్లు”  తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం

హైదరాబాద్, మార్చి 23: వృద్ధ తల్లిదండ్రుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. “పేరెంట్స్ సపోర్ట్ బిల్లు”కు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కుటుంబ బాధ్యతలను నిర్లక్ష్యం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకునేలా ఈ బిల్లు రూపుదిద్దుకుంది.

ఈ బిల్లు ప్రకారం తల్లిదండ్రులను చూసుకోని ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగుల జీతాల నుంచి 15 శాతం లేదా రూ.10,000 (ఏది తక్కువైతే అది) కోత విధించి, ఆ మొత్తాన్ని వారి తల్లిదండ్రులకు అందించే విధానం అమలు చేయనున్నారు.

ఫిర్యాదుల ఆధారంగా సంబంధిత అధికారుల ద్వారా విచారణ జరిపి, నిర్లక్ష్యం నిర్ధారణ అయిన పక్షంలోనే ఈ కోత అమలు అవుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. వృద్ధుల ఆర్థిక భద్రతను బలోపేతం చేయడంతో పాటు కుటుంబ విలువలను కాపాడటం ఈ చట్టం ప్రధాన ఉద్దేశ్యంగా పేర్కొంది.

ఈ నిర్ణయంతో వృద్ధ తల్లిదండ్రులకు మరింత రక్షణ లభిస్తుందని, కుటుంబ బాధ్యతలపై సమాజంలో చైతన్యం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.