BREAKING
తప్పిపోయిన వృద్ధ మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు పలమనేరు–బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ తప్పిపోయిన వృద్ధ మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు పలమనేరు–బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ
Date of Publish : 23 March 2026, 11:20 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తల్లిదండ్రులకు రక్షణగా “పేరెంట్స్ సపోర్ట్ బిల్లు”

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Mar, 2026 - 11:20 PM
125 వీక్షణలు

తల్లిదండ్రులకు రక్షణగా “పేరెంట్స్ సపోర్ట్ బిల్లు”  తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం

హైదరాబాద్, మార్చి 23: వృద్ధ తల్లిదండ్రుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. “పేరెంట్స్ సపోర్ట్ బిల్లు”కు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కుటుంబ బాధ్యతలను నిర్లక్ష్యం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకునేలా ఈ బిల్లు రూపుదిద్దుకుంది.

ఈ బిల్లు ప్రకారం తల్లిదండ్రులను చూసుకోని ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగుల జీతాల నుంచి 15 శాతం లేదా రూ.10,000 (ఏది తక్కువైతే అది) కోత విధించి, ఆ మొత్తాన్ని వారి తల్లిదండ్రులకు అందించే విధానం అమలు చేయనున్నారు.

ఫిర్యాదుల ఆధారంగా సంబంధిత అధికారుల ద్వారా విచారణ జరిపి, నిర్లక్ష్యం నిర్ధారణ అయిన పక్షంలోనే ఈ కోత అమలు అవుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. వృద్ధుల ఆర్థిక భద్రతను బలోపేతం చేయడంతో పాటు కుటుంబ విలువలను కాపాడటం ఈ చట్టం ప్రధాన ఉద్దేశ్యంగా పేర్కొంది.

ఈ నిర్ణయంతో వృద్ధ తల్లిదండ్రులకు మరింత రక్షణ లభిస్తుందని, కుటుంబ బాధ్యతలపై సమాజంలో చైతన్యం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.