BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

తల్లిపాలు శిశువుకు సంపూర్ణ పోషకాహారం: తిరువూరు ఎమ్మెల్యే శ్రీనివాసరావు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Aug, 2026 - 06:09 PM
36 వీక్షణలు

తల్లిపాలు శిశువుకు సంపూర్ణ పోషకాహారం: తిరువూరు ఎమ్మెల్యే శ్రీనివాసరావు

తిరువూరు: తల్లిపాలు శిశువుకు సంపూర్ణ పోషకాహారాన్ని అందించడంతో పాటు వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలో కీలకపాత్ర పోషిస్తాయని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అన్నారు. తిరువూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రపంచ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం నిర్వహించారు.

కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ పుట్టిన వెంటనే శిశువుకు తల్లిపాలు ఇవ్వడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయన్నారు. శిశువుకు తొలి ఆరు నెలల పాటు తల్లిపాలను మాత్రమే అందించాలని, అనంతరం అదనపు పోషకాహారంతో పాటు తల్లిపాలను కొనసాగించాలని సూచించారు. గర్భిణులు, బాలింతలకు తల్లిపాల ప్రాధాన్యంపై అవగాహన కల్పించడంలో అంగన్వాడీ సిబ్బంది, ఐసీడీఎస్ అధికారులు కీలకపాత్ర పోషించాలని పేర్కొన్నారు.

గర్భిణులు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ పౌష్టికాహారం తీసుకోవడంతో పాటు వైద్యుల సూచనలు పాటించాలని సూచించారు. తల్లి ఆరోగ్యంగా ఉంటేనే బిడ్డ ఆరోగ్యంగా ఎదుగుతాడన్నారు.

కార్యక్రమంలో ఐసీడీఎస్ అధికారులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, గర్భిణులు, బాలింతలు పాల్గొన్నారు. తిరువూరు ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ డైరెక్టర్ ఆకుల దుర్గాప్రసాద్, ఏపీఎం శేఖర్ తదితరులు పాల్గొన్నారు.