BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

తన సొంత నిధులతో డ్రైనేజీ సమస్య పరిష్కరించిన కృష్ణారావుపాలెం ఎంపీటీసీ చింతగుంట్ల వెంకటేశ్వరరావు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Jun, 2026 - 04:58 PM
378 వీక్షణలు

చాట్రాయి మండలంలోని కృష్ణారావుపాలెం గ్రామంలో విజయవాడ–సత్తుపల్లి ప్రధాన తారు రహదారిపై, రమణ శ్రీకాంత్ ఇంటి ఎదురుగా వర్షపు నీరు నిల్వ ఉండటంతో పెద్ద గుంత ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ సమస్యను గుర్తించిన కృష్ణారావుపాలెం ఎంపీటీసీ చింతగుంట్ల వెంకటేశ్వరరావు తన సొంత నిధులతో ప్రొక్లెయిన్ ఏర్పాటు చేసి డ్రైనేజీ తీయించి సమస్యను పరిష్కరించారు. దీంతో రహదారిపై నిలిచిన నీరు తొలగి వాహనాల రాకపోకలు సాఫీగా సాగుతున్నాయి.

ఈ సందర్భంగా గ్రామస్తులు చింతగుంట్ల వెంకటేశ్వరరావును అభినందిస్తూ, ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయన చూపుతున్న చొరవ ప్రశంసనీయమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకుడు రమణ శ్రీకాంత్‌తో పాటు గ్రామస్తులు గుంజి కోటేశ్వరరావు, పండు జిన్నా, పుచ్చకాయల మహేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.