www.ntodaynews.com
తన సొంత నిధులతో డ్రైనేజీ సమస్య పరిష్కరించిన కృష్ణారావుపాలెం ఎంపీటీసీ చింతగుంట్ల వెంకటేశ్వరరావు
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
చాట్రాయి మండలంలోని కృష్ణారావుపాలెం గ్రామంలో విజయవాడ–సత్తుపల్లి ప్రధాన తారు రహదారిపై, రమణ శ్రీకాంత్ ఇంటి ఎదురుగా వర్షపు నీరు నిల్వ ఉండటంతో పెద్ద గుంత ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ సమస్యను గుర్తించిన కృష్ణారావుపాలెం ఎంపీటీసీ చింతగుంట్ల వెంకటేశ్వరరావు తన సొంత నిధులతో ప్రొక్లెయిన్ ఏర్పాటు చేసి డ్రైనేజీ తీయించి సమస్యను పరిష్కరించారు. దీంతో రహదారిపై నిలిచిన నీరు తొలగి వాహనాల రాకపోకలు సాఫీగా సాగుతున్నాయి.
ఈ సందర్భంగా గ్రామస్తులు చింతగుంట్ల వెంకటేశ్వరరావును అభినందిస్తూ, ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయన చూపుతున్న చొరవ ప్రశంసనీయమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకుడు రమణ శ్రీకాంత్తో పాటు గ్రామస్తులు గుంజి కోటేశ్వరరావు, పండు జిన్నా, పుచ్చకాయల మహేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.