BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

తన సొంత నిధులతో డ్రైనేజీ సమస్య పరిష్కరించిన కృష్ణారావుపాలెం ఎంపీటీసీ చింతగుంట్ల వెంకటేశ్వరరావు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Jun, 2026 - 04:58 PM
428 వీక్షణలు

చాట్రాయి మండలంలోని కృష్ణారావుపాలెం గ్రామంలో విజయవాడ–సత్తుపల్లి ప్రధాన తారు రహదారిపై, రమణ శ్రీకాంత్ ఇంటి ఎదురుగా వర్షపు నీరు నిల్వ ఉండటంతో పెద్ద గుంత ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ సమస్యను గుర్తించిన కృష్ణారావుపాలెం ఎంపీటీసీ చింతగుంట్ల వెంకటేశ్వరరావు తన సొంత నిధులతో ప్రొక్లెయిన్ ఏర్పాటు చేసి డ్రైనేజీ తీయించి సమస్యను పరిష్కరించారు. దీంతో రహదారిపై నిలిచిన నీరు తొలగి వాహనాల రాకపోకలు సాఫీగా సాగుతున్నాయి.

ఈ సందర్భంగా గ్రామస్తులు చింతగుంట్ల వెంకటేశ్వరరావును అభినందిస్తూ, ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయన చూపుతున్న చొరవ ప్రశంసనీయమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకుడు రమణ శ్రీకాంత్‌తో పాటు గ్రామస్తులు గుంజి కోటేశ్వరరావు, పండు జిన్నా, పుచ్చకాయల మహేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.