www.ntodaynews.com
విజయవంతంగా ముగిసిన పశు ఆరోగ్య శిబిరాలు
తెలంగాణ
విజయవంతంగా ముగిసిన పశు ఆరోగ్య శిబిరాలు
NTODAY NEWS: ఆమడగూరు మండలం రిపోర్టర్ రామాంజనేయులు
ఆమడగూరు మండలంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో 19-01-2026 నుండి 30-01-2026 వరకు ప్రతి గ్రామ పంచాయతీలో పశు వైద్య ఆరోగ్య శిబిరాలను విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఇన్చార్జ్ పశువైద్యాధికారి డాక్టర్ బి. రవి నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
శిబిరాల సందర్భంగా గ్రామాల వారీగా మొత్తం
-186 పశువులకు గర్భకోశ వ్యాధుల చికిత్సలు
-594 పశువులకు సాధారణ వైద్య చికిత్సలు
-778 పాడి ఆవులు, దూడలకు నట్టల నివారణ మందులు
-19,115 గొర్రెలకు నట్టల నివారణ మందులు మరియు బొబ్బరోగం టీకాలు
ఉచితంగా అందజేశారు.
ఈ శిబిరాల ద్వారా పశువుల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు పాడి రైతులకు ఆర్థికంగా ఎంతో ప్రయోజనం చేకూరిందని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది, గ్రామాల పాడి రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని శిబిరాలను విజయవంతం చేశారు.
#AnimalHealthCamp
#VeterinaryServices
#LivestockCare
#Amadaguru
#FreeMedicalCamp
#DairyFarmers
#RuralDevelopment
#AnimalWelfare
Follow us on
Website
Facebook
Instagram
YouTube