www.ntodaynews.com
అమ్మవారిని దర్శించుకున్న ఏపీ బీజేపీ అధ్యక్షులు
తెలంగాణ
కుటుంబ సమేతంగా కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న ఏపీ బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్
NTODAY NEWS: విజయవాడ రిపోర్టర్ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయంలో ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ కుటుంబ సమేతంగా దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఈ సందర్భంగా వేద పండితులు మాధవ్ దంపతులకు ఆశీర్వచనాలు అందించి అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించారు. అనంతరం మాధవ్ దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ, కనకదుర్గ అమ్మవారి చల్లని దీవెనలతో రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో శాంతిగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, బీజేపీ ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోలపల్లి గణేష్, కనకదుర్గ ఆలయ పాలక మండలి సభ్యుడు అవ్వారు బుల్లబ్బాయి, బీజేపీ ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షులు నున్న కృష్ణ, బొమ్మదేవర రత్నకుమారి, పైలా సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube