www.ntodaynews.com
ఏళ్ల బయన్నకు ఉత్తమ ఫోటోగ్రఫీ అవార్డు
తెలంగాణ
ఏళ్ల బయన్నకు ఉత్తమ ఫోటోగ్రఫీ అవార్డు
NTODAY NEWS : చిట్యాల నల్గొండ జిల్లా చిట్యాల మండలానికి చెందిన సీనియర్ జర్నలిస్టు ప్రముఖ ఫోటోగ్రాఫర్ ఏళ్ల బయన్నకు లంబాడా జీవనశైలి విధానంపై జరిగిన ఫోటోగ్రఫీ వర్క్ షాప్లో లో ఉత్తమ ఫోటోగ్రఫీ అవార్డు అందుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇల్లందు మండలం రాళ్ల బండ గ్రామంలో డిసెంబర్ 13 నుండి 15 వరకు తేదీలలో హుస్సేన్ ఖాన్ (ఏ ఎఫ్ ఐ ఏ పి) ఆధ్వర్యంలో లంబాడ జీవన శైలి, సంస్కృతి సాంప్రదాయాలు , లంబాడ మహిళల జీవితం, వారి శ్రమ, ఆనందం, గ్రామీణ జీవన విధానం గురించి ప్రపంచానికి తెలియజేసే విధంగా ఫోటోగ్రఫీ వర్క్ షాప్ ను నిర్వహించారు. ఈ వర్క్ షాప్ కు దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన ఫోటోగ్రాఫర్లు తాము తీసిన ఛాయాచిత్రాలను ప్రదర్శించారు.
ఈ చాయా చిత్రాలలో లంబాడ జీవన విధానం ఉట్టిపడేలా ఉన్న ఏళ్ల బయన్న తీసిన ఛాయా చిత్రాలకు ఉత్తమ అవార్డుకు ఎంపికయ్యాయి.. ఈ ప్రత్యేకమైన అవార్డును లంబాడి అవార్డు ఫోటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులు తుమ్మ శ్రీనివాస్ రెడ్డి ఉత్తమ ఫోటోగ్రాఫర్ అవార్డును ఏళ్ల బయన్న కు అందించారు. ఈ సందర్భంగా తుమ్మ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ లంబాడా జీవన చరిత్ర ప్రపంచానికి తెలియజేసే విషయంలో ఫోటోగ్రఫీ వర్క్ షాప్ ఒక మంచి కార్యక్రమం అని అన్నారు. రాళ్ల బండ గ్రామంలో ఈ జాతీయ స్థాయి వర్క్ షాప్ నిర్వహించడం గర్వకారణమని, గ్రామీణ సంస్కృతి, పరిరక్షణకు ఇది ఒక మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. ఉత్తమ ఫోటోగ్రఫీ అవార్డు అందుకున్న ఏళ్ల బయన్న ను పలువురు అభినందించారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube