www.ntodaynews.com
వైభవంగా మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు
తెలంగాణ
లాలపల్లిలో వైభవంగా మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు
నాగవెల్లి పట్నాల మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే విజయరమణ రావు NTODAY NEWS: గొల్లపల్లి మండలం రిపోర్టర్ లక్ష్మణ్ ఎలిగేడు మండలం లాలపల్లి గ్రామంలో వెలసిన మల్లికార్జున స్వామి ఆలయం బ్రహ్మోత్సవాలు భక్తుల జయజయధ్వానాలతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం నిర్వహించిన నాగవెల్లి పట్నాల మహోత్సవంలో పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
స్వామి ఆశీస్సులు ప్రజలపై ఉండాలి
ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యేకు ఆలయ అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం నాగవెల్లి పట్నాల మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, మల్లికార్జున స్వామి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.
ఎమ్మెల్యేకు ఘన సన్మానం
దర్శనం అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే విజయరమణ రావును శాలువాతో సత్కరించి, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
#MallikarjunaSwamy
#Brahmotsavam
#TempleFestival
#NagavelliPatnalaMahotsavam
#Lalapalli
#TelanganaTemples
#SpiritualCelebration
#DevotionalEvent
#NtodayNews
#VillageFestival
Follow us on
Website
Facebook
Instagram
YouTube 