BREAKING
ఘనంగా మురళి మోహన్ యాదవ్ పుట్టినరోజు వేడుకలు పదో తరగతి, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష కేంద్రాల వద్ద డ్రోన్లతో గట్టి నిఘా:- జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఏపీ ఖజానాకు కాసుల వర్షం రికార్డు స్థాయిలో GST వసూళ్లు! తెలంగాణలో అమల్లోకి వచ్చిన న్యాయవాదుల రక్షణ చట్టం ​మందమర్రి సహకార సంఘం కార్యాలయంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రహరీ గోడను వెంటనే పునర్నిర్మించకుంటే నిరసన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై ఆంక్షలు విధించడంపై స్పందన పోలీస్ అధికారులకు కూలింగ్ కళ్ళద్దాలు అందజేసిన ప్రత్తిపాటి. పిడుగుపాటుకు గొర్రెల కాపరి మృతి.. చింతలవల్లిలో విషాదం కిల్కారి కాల్ సేవలు పై అవగాహన కార్యక్రమం ఘనంగా మురళి మోహన్ యాదవ్ పుట్టినరోజు వేడుకలు పదో తరగతి, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష కేంద్రాల వద్ద డ్రోన్లతో గట్టి నిఘా:- జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఏపీ ఖజానాకు కాసుల వర్షం రికార్డు స్థాయిలో GST వసూళ్లు! తెలంగాణలో అమల్లోకి వచ్చిన న్యాయవాదుల రక్షణ చట్టం ​మందమర్రి సహకార సంఘం కార్యాలయంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రహరీ గోడను వెంటనే పునర్నిర్మించకుంటే నిరసన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై ఆంక్షలు విధించడంపై స్పందన పోలీస్ అధికారులకు కూలింగ్ కళ్ళద్దాలు అందజేసిన ప్రత్తిపాటి. పిడుగుపాటుకు గొర్రెల కాపరి మృతి.. చింతలవల్లిలో విషాదం కిల్కారి కాల్ సేవలు పై అవగాహన కార్యక్రమం
www.ntodaynews.com

ఓబీసీ,బీసీ ఉద్యోగులకు క్రిమిలేయర్ తొలిగించాలి

తెలంగాణ
22 Apr, 2025 - 08:37 AM
313 వీక్షణలు
ఓబీసీ,బీసీ ఉద్యోగులకు క్రిమిలేయర్ తొలిగించాలి. ఓబీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలి ఓబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు వరప్రసాద్ యాదవ్ విజయవాడ: కేంద్ర ప్రభుత్వం ఓబీసీ, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు శ్రీ అంగిరేకుల వరప్రసాద్ యాదవ్ డిమాండ్ చేశారు.మంగళవారం విజయవాడ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో వరప్రసాద్ యాదవ్, రాష్ట్ర ఓబీసీ మహిళా ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ శ్రీదేవి యాదవ్ తో కలసి మాట్లాడారు. ఎస్సీ ఎస్టీ లకు వలే ఓబీసి ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించేందుకు ఓబీసి వర్గానికి చెందిన ప్రధాని నరేంద్ర మోదీ భాద్యత తీసుకోవాలనీ వరప్రసాద్ యాదవ్ డిమాండ్ చేశారు, బీసీ, ఓబీసీ ఉద్యోగులకు క్రెమిలేయర్ విధానం అమలు చేయటం సమంజసం కాదన్నారు, కేంద్రంలో ఓబీసీ లకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్ర బాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోదీ పై ఒత్తిడి తేవాలని వరప్రసాద్ యాదవ్ విజ్ఞప్తి చేశారు ఏపీ రాష్ట్రంలో బీసీ కులాల మహిళల పై జరుగుతున్న దాడులను ఖండిస్తూ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం బీసీ రక్షణ చట్టం చేసేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని వరప్రసాద్ యాదవ్ సీఎం చంద్రబాబు నాయుడును కోరారు. ఓబీసీ మహిళా ఉద్యోగుల సంఘం రాష్ట్ర కన్వీనర్ గా శ్రీదేవి యాదవ్. ఓబీసీ మహిళా ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ గా శ్రీదేవి యాదవ్ ను నియమిస్తూ జాతీయ అధ్యక్షులు వరప్రసాద్ యాదవ్ నియామక ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా నూతనంగా రాష్ట్ర కన్వీనర్ గా నియమితులైన శ్రీదేవి యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో 63 ప్రభుత్వ శాఖలలో ఓబీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ను బలోపేతం చేయడం ద్వారా బీసీ ఉద్యమం ను ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తానని తెలిపారు.తనని ఓబీసీ మహిళా ఉద్యోగుల సంఘం రాష్ట్ర కన్వీనర్ గా నియమించిన ఓబీసీ సంఘం జాతీయ అధ్యక్షులు వరప్రసాద్ యాదవ్ కు కృతజ్ఞతలు తెలిపారు.ఓబీసీ ,బీసీ ఉద్యోగుల క్రిమిలేయర్ సీలింగ్ పరిమితిని తక్షణమే రూ 11 లక్షలకు పెంచాలని శ్రీదేవి డిమాండ్ చేశారు. ఈ విలేకర్ల సమావేశంలో ఓబీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సుజాన్ సింగ్, విజయవాడ నగర ప్రధాన కార్యదర్శి కాశీ విశ్వనాథ్,ఓబీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి జి.మాధవ రావు , డిఆర్ యూసీసీ సభ్యులు కాకు బాల నారాయణ, మహిళ సంఘం రాష్ట్ర కార్యదర్శిఎం .అంకమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీదేవి యాదవ్ ను పలు శాఖల బీసీ ఉద్యోగులు శాలువాలతో అభినందించారు. Follow us on Website Facebook Instagram YouTube