స్వర్ణ ఆంధ్ర స్వచ్ ఆంధ్ర కార్యక్రమానికి ముఖ్య అదితి గా పాల్గొన్న ఏలూరు ఎమ్మెల్యే
NTODAY NEWS: ఏలూరు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కళ్యాణ్ కుమార్
ఏలూరు నియోజకవర్గం 28వ డివిజన్ లో స్వర్ణ ఆంధ్ర స్వచ్ ఆంధ్ర కార్యక్రమానికి ముఖ్య అదితి గా పాల్గొన్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణ ఆంధ్ర స్వచ్ ఆంధ్ర కార్యక్రమం ప్రతి నెల మూడవ శనివారం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పరిసరాల పరిశుభ్రత మీద ప్రజలు కు అవగాహనా కల్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నగర కమిషనర్ మాట్లాడుతు, ప్రస్తుత పరిస్థితి లో ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలి. ప్రస్తుతం ప్రజలు అందరు వాటర్ కొనుక్కొని తాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాబోయే రోజుల్లో మనం పీల్చే గాలి కూడా కొనుక్కొని శ్వాస తీసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. కావున ప్రతి ఒక్కరు పరిశుభ్రత పాటించాలని తెలియజేసారు. ఇంటింటా చెట్టు ఊరంతా వనం అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని ఏలూరు ఎమ్మెల్యే ప్రారంభించారు. స్థానిక డివిజన్ లో ఎమ్మెల్యే మొక్కలు నాటారు. భవిష్యత్ లో ప్రతి ఒక్కరు ఆర్థికంగా ఎదుగుదల కావాల్సిన సదుపాయాలు ప్రభుత్వం కల్పిస్తుంది. అందరు సోలార్ పై అవగాహనా పెంచుకోవాలని ఎమ్మెల్యే తెలియజేసారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube