www.ntodaynews.com
రామన్నపేటలో నూతన కోర్టు భవనాలకు శంకుస్థాపన
తెలంగాణ
రామన్నపేటలో నూతన కోర్టు భవనాలకు శంకుస్థాపన
33 కోట్ల వ్యయంతో 4 కోర్టులు, రెసిడెన్షియల్ క్వార్టర్స్ నిర్మాణం
NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట
రామన్నపేట మండల కేంద్రంలో ఐదు ఎకరాల విస్తీర్ణంలో రూ.33 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నూతన నాలుగు కోర్టు భవనాలు మరియు రెసిడెన్షియల్ క్వార్టర్స్కు శుక్రవారం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కె. శరత్, జస్టిస్ సామ్ కోసాయ్, జస్టిస్ లక్ష్మణ్, జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి, జస్టిస్ సుజనా కలసికమ్, జస్టిస్ నర్సింగ్ రావు నందికొండ ముఖ్య అతిథులుగా పాల్గొని శంకుస్థాపన చేశారు. వీరితో పాటు జిల్లా కలెక్టర్ హనుమంతరావు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిధిలోని వివిధ కోర్టుల న్యాయమూర్తులు, న్యాయవాదులు, రాజకీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. నూతన కోర్టు భవనాల నిర్మాణంతో రామన్నపేట ప్రాంత ప్రజలకు న్యాయ సేవలు మరింత సులభంగా అందుబాటులోకి రానున్నాయని నిర్వాహకులు తెలిపారు.
భారీ బందోబస్తు
హైకోర్టు న్యాయమూర్తులు పాల్గొన్న నేపథ్యంలో డీసీపీ ఆకాంక్ష యాదవ్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి భద్రతను కట్టుదిట్టం చేశారు.
#YadadriBhuvanagiri
#Ramannapet
#CourtBuildings
#JudicialInfrastructure
#TelanganaHighCourt
#JusticeSystem
#PublicInfrastructure
#LawAndOrder
Follow us on
Website
Facebook
Instagram
YouTube