
ఘనంగా ప్రారంభమైన గొల్లపల్లి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నీ
NTODAY NEWS: జగిత్యాల జిల్లా, గొల్లపల్లి
గొల్లపల్లి మండల పరిధిలోని రాపల్లి గ్రామంలో గొల్లపల్లి ప్రీమియర్ లీగ్ (GPL) క్రికెట్ టోర్నమెంట్ మంగళవారం ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమైంది. ఈ టోర్నీని ముఖ్య అతిథులుగా హాజరైన నల్ల నీరజ, సతీష్ రెడ్డి కొబ్బరికాయ కొట్టి అధికారికంగా ప్రారంభించారు.
అనంతరం వారు క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో యువతలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికితీయడంలో ఇటువంటి టోర్నమెంట్లు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. క్రీడలు శారీరక ధారుడ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కూడా అందిస్తాయని, క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడా స్ఫూర్తిని చాటాలని పిలుపునిచ్చారు. మైదానంలో టీమ్ సభ్యులందరికీ కరచలనం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.
రూ.20,000 నగదు బహుమతి
ఈ టోర్నమెంట్లో విజేతగా నిలిచే జట్టుకు రూ.20,000 నగదు బహుమతి అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గొల్లపల్లి ఉప సర్పంచ్ గురిజాల బుచ్చిరెడ్డి, టోర్నీ నిర్వాహకులు, స్థానిక నాయకులు, క్రీడాకారులు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్థులు పాల్గొన్నారు.
#GollapalliPremierLeague
#GPLCricket
#VillageCricket
#GrassrootsSports
#CricketTournament
#RuralYouth
#SportsDevelopment
#LocalNews
Follow us on
Website
Facebook
Instagram
YouTube