BREAKING
యోగాంధ్ర కార్యక్రమాల విజయవంత నిర్వహణకు శ్రీశైలం దేవస్థానం ప్రణాళిక బీటెక్ విద్యార్థి కిడ్నాప్ కలకలం.. చివరకు పల్నాడు జిల్లా నరసరావుపేటలో భారీ చోరీ. హోంమంత్రిపై తప్పుడు వ్యాఖ్యలు చేయడం తగదు: ఆగివున్న లారీని ఢీకొట్టిన మినీ బస్సు .. ఒకరు మృతి, 13 మందికి గాయాలు! మార్కాపురంలో రేషన్ బియ్యం మాఫియాకు భారీ షాక్.. 1922 కేజీల బియ్యం సీజ్! అంగరంగ వైభవంగా జన్మదిన వేడుకలు.... ట్రాక్టర్లకు రేడియం స్టిక్కర్లు.. రహదారి ప్రమాదాల నివారణకు నూజివీడు పోలీసుల ప్రత్యేక చర్య పుంగనూరులో తల్లిపై కుమారుడి కర్రలతో దాడి పల్లె నిద్రలో ప్రజలతో మమేకమైన ఆగిరిపల్లి పోలీసులు యోగాంధ్ర కార్యక్రమాల విజయవంత నిర్వహణకు శ్రీశైలం దేవస్థానం ప్రణాళిక బీటెక్ విద్యార్థి కిడ్నాప్ కలకలం.. చివరకు పల్నాడు జిల్లా నరసరావుపేటలో భారీ చోరీ. హోంమంత్రిపై తప్పుడు వ్యాఖ్యలు చేయడం తగదు: ఆగివున్న లారీని ఢీకొట్టిన మినీ బస్సు .. ఒకరు మృతి, 13 మందికి గాయాలు! మార్కాపురంలో రేషన్ బియ్యం మాఫియాకు భారీ షాక్.. 1922 కేజీల బియ్యం సీజ్! అంగరంగ వైభవంగా జన్మదిన వేడుకలు.... ట్రాక్టర్లకు రేడియం స్టిక్కర్లు.. రహదారి ప్రమాదాల నివారణకు నూజివీడు పోలీసుల ప్రత్యేక చర్య పుంగనూరులో తల్లిపై కుమారుడి కర్రలతో దాడి పల్లె నిద్రలో ప్రజలతో మమేకమైన ఆగిరిపల్లి పోలీసులు
www.ntodaynews.com

ఘనంగా నూతన సంవత్సర ప్రత్యేక ప్రార్థనలు

తెలంగాణ
01 Jan, 2026 - 09:28 AM
85 వీక్షణలు

శాఖపూర్ మెస్సియా సమాజ మందిరంలో ఘనంగా నూతన సంవత్సర ప్రత్యేక ప్రార్థనలు

NTODAY NEWS: గొల్లపల్లి మండలం రిపోర్టర్ జగిత్యాల జిల్లా: వెల్గటూర్ మండలం శాఖపూర్ గ్రామంలోని మెస్సియా సమాజ మందిరంలో 2026 నూతన సంవత్సర వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆధ్యాత్మిక సందేశం చర్చీ పాస్టర్లు జాన్ మహేష్, సంతోష్, నాతనీలు ఈ వేడుకల్లో పాల్గొని భక్తులకు దైవ సందేశాన్ని అందించారు. ఆదికాండము 17:1 వచనంలోని “నేను సర్వశక్తిగల దేవుడను (ఎలోహిం)” అనే అంశంపై ప్రత్యేక వాక్యాన్ని బోధించారు. చర్చీ నిర్మాణ ప్రారంభం నుండి దేవుడు చూపిస్తున్న కృపను గుర్తుచేస్తూ, నూతన సంవత్సరంలో అందరూ దైవ చింతనతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కీర్తనలు క్రైస్తవ సోదరీమణులు భక్తి పాటలతో యేసయ్యను స్తుతించగా, చిన్నారులు తబలా వాయిద్యాలతో ఆకట్టుకున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా అందరూ కలిసి కేక్ కట్ చేసి, ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ క్రీస్తు ప్రేమను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో మోకేనాపల్లి గోపి, ఎనగందుల రవి, గాజుల అనిల్, ఉపారపు రాములు, గాజుల రాజయ్య, గాజుల లక్ష్మి–రాజాం, ఉపారపు శ్రీధర్‌తో పాటు పెద్ద సంఖ్యలో విశ్వాసులు, సోదరీమణులు, చిన్నారులు పాల్గొన్నారు. అందరూ భక్తిశ్రద్ధలతో ప్రార్థనల్లో పాల్గొని నూతన సంవత్సర దీవెనలు అందుకున్నారు. తమ దేవునికి యుగయుగములు మహిమ కలుగును గాక అని దైవజనులు ఆకాంక్షించారు. Follow us on Website Facebook Instagram YouTube