BREAKING
జనగనణ ప్రారంభం - భూమా అఖిలప్రియరెడ్డి MLA ఆళ్లగడ్డ ​గూడెం గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి.. ​మంచిర్యాల పట్టణంలో చలివేంద్రాలను ప్రారంభించిన శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఏలూరు మెయిన్ రోడ్డు రహదారి నిర్మాణపు పనులు వేగవంతం చేయాలి.... ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి నియామకం నంద్యాల జిల్లా, ఆత్మకూరు మున్సిపాలిటీ నూతన మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి మేఘన ఎస్టేట్ బాధితుల తరపున కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి వినతి పత్రం అందజేత. పోలవరంలో మృతుని కుటుంబానికి పదివేల రూపాయలు అందజేత చాట్రాయిలో గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా ఘన నివాళి మూడు నెలల రేషన్ పంపిణీ.. క్యూలైన్‌లో గంటల తరబడి తిప్పలు... కరెంటు కోత.. ఉక్కపోత.. జనగనణ ప్రారంభం - భూమా అఖిలప్రియరెడ్డి MLA ఆళ్లగడ్డ ​గూడెం గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి.. ​మంచిర్యాల పట్టణంలో చలివేంద్రాలను ప్రారంభించిన శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఏలూరు మెయిన్ రోడ్డు రహదారి నిర్మాణపు పనులు వేగవంతం చేయాలి.... ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి నియామకం నంద్యాల జిల్లా, ఆత్మకూరు మున్సిపాలిటీ నూతన మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి మేఘన ఎస్టేట్ బాధితుల తరపున కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి వినతి పత్రం అందజేత. పోలవరంలో మృతుని కుటుంబానికి పదివేల రూపాయలు అందజేత చాట్రాయిలో గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా ఘన నివాళి మూడు నెలల రేషన్ పంపిణీ.. క్యూలైన్‌లో గంటల తరబడి తిప్పలు... కరెంటు కోత.. ఉక్కపోత..
www.ntodaynews.com

ఘనంగా నూతన సంవత్సర ప్రత్యేక ప్రార్థనలు

తెలంగాణ
01 Jan, 2026 - 09:28 AM
57 వీక్షణలు

శాఖపూర్ మెస్సియా సమాజ మందిరంలో ఘనంగా నూతన సంవత్సర ప్రత్యేక ప్రార్థనలు

NTODAY NEWS: గొల్లపల్లి మండలం రిపోర్టర్ జగిత్యాల జిల్లా: వెల్గటూర్ మండలం శాఖపూర్ గ్రామంలోని మెస్సియా సమాజ మందిరంలో 2026 నూతన సంవత్సర వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆధ్యాత్మిక సందేశం చర్చీ పాస్టర్లు జాన్ మహేష్, సంతోష్, నాతనీలు ఈ వేడుకల్లో పాల్గొని భక్తులకు దైవ సందేశాన్ని అందించారు. ఆదికాండము 17:1 వచనంలోని “నేను సర్వశక్తిగల దేవుడను (ఎలోహిం)” అనే అంశంపై ప్రత్యేక వాక్యాన్ని బోధించారు. చర్చీ నిర్మాణ ప్రారంభం నుండి దేవుడు చూపిస్తున్న కృపను గుర్తుచేస్తూ, నూతన సంవత్సరంలో అందరూ దైవ చింతనతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కీర్తనలు క్రైస్తవ సోదరీమణులు భక్తి పాటలతో యేసయ్యను స్తుతించగా, చిన్నారులు తబలా వాయిద్యాలతో ఆకట్టుకున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా అందరూ కలిసి కేక్ కట్ చేసి, ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ క్రీస్తు ప్రేమను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో మోకేనాపల్లి గోపి, ఎనగందుల రవి, గాజుల అనిల్, ఉపారపు రాములు, గాజుల రాజయ్య, గాజుల లక్ష్మి–రాజాం, ఉపారపు శ్రీధర్‌తో పాటు పెద్ద సంఖ్యలో విశ్వాసులు, సోదరీమణులు, చిన్నారులు పాల్గొన్నారు. అందరూ భక్తిశ్రద్ధలతో ప్రార్థనల్లో పాల్గొని నూతన సంవత్సర దీవెనలు అందుకున్నారు. తమ దేవునికి యుగయుగములు మహిమ కలుగును గాక అని దైవజనులు ఆకాంక్షించారు. Follow us on Website Facebook Instagram YouTube