BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

ఘనంగా వారిజాల వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవం

తెలంగాణ
01 Feb, 2026 - 08:11 AM
360 వీక్షణలు
ఘనంగా వారిజాల వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవం NTODAY NEWS: నార్కట్‌పల్లి నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం గోపులాయపల్లి గ్రామంలో కొలువైన శ్రీ వారిజాల వేణుగోపాల స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు కోమటిరెడ్డి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైభవంగా కళ్యాణ ఘట్టాలు కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఉదయం గణపతి పూజ, పల్లకి సేవ, ఎదుర్కోలు, అనంతరం కళ్యాణ కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పురోహితులు వెంకటాచార్యులు మాట్లాడుతూ, మాఘమాస పౌర్ణమి రోజున స్వామివారి కళ్యాణం జరపడం అత్యంత విశేషమని తెలిపారు. ‘వారిజాల’ అంటే ప్రవహించే నీరు అని, ఆ జలములోనే స్వామి ఉద్భవించారని వివరించారు. బ్రహ్మోత్సవాలు మొత్తం ఎనిమిది రోజులపాటు కొనసాగుతాయని, ఆదివారం కళ్యాణ మహోత్సవం, ఈ నెల 4వ తేదీన రథోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే ప్రతిరోజూ హనుమాన్ వాహన సేవ, శేష వాహన సేవ, గరుడ వాహన సేవలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. స్వామివారి కళ్యాణాన్ని దర్శించిన భక్తులకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయని అన్నారు. గోవింద నామస్మరణతో మార్మోగిన గోపులాయపల్లి కళ్యాణ సమయంలో గోపులాయపల్లి కొండ ప్రాంతం గోవింద నామస్మరణతో మార్మోగింది. బ్రహ్మోత్సవాలకు తరలివచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవాదాయ, రెవెన్యూ, పోలీసు శాఖల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. పటిష్ట బందోబస్తు ఏర్పాటు ఈ సందర్భంగా సీఐ నాగరాజు మాట్లాడుతూ, బ్రహ్మోత్సవాల్లో పాల్గొనే భక్తుల భద్రత కోసం సుమారు 300 మంది పోలీసు సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మహిళల రక్షణ కోసం షీ-టీమ్‌లను కూడా మోహరించినట్లు చెప్పారు. #VarijalaVenugopalaSwamy #Brahmotsavams #KalyanaMahotsavam #NalgondaNews #Narketpally #TempleFestival #DevotionalNews Follow us on Website Facebook Instagram YouTube