www.ntodaynews.com
వైభవంగా రథసప్తమి వేడుకలు
తెలంగాణ
సూర్యప్రభ వాహనంపై కళ్యాణ వెంకటరమణ స్వామి అభయం
వైభవంగా రథసప్తమి వేడుకలు
NTODAY NEWS: పుంగనూరు
పుంగనూరు తితిదే పరిధిలోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయంలో ఆదివారం (25-01-2026) రథసప్తమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు.
ఉదయం 5.00 గంటలకు సుప్రభాత సేవతో స్వామిని మేల్కొలిపి, నిత్య కైంకర్యాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గర్భాలయంలో మూలమూర్తికి విశేష అలంకరణలు చేశారు.
ఉదయం 7.00 గంటలకు ఉత్సవ మూర్తిని సూర్యప్రభ వాహనంపై అధిరోహింపజేసి సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనంతరం బ్రాహ్మణ వీధి, కుమ్మర వీధి, కట్టకింద పాల్యం, నగరి వీధి గుండా ఉదయం 11.00 గంటల వరకు గ్రామోత్సవం నిర్వహించారు.
ఈ కార్యక్రమాలకు పుంగనూరు వాసి రామచంద్ర యాదవ్ ఉభయదారుగా వ్యవహరించి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. నగర వాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారికి అడుగడుగున కర్పూర హారతులు సమర్పించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి, ఉద్యోగి చెంగప్ప, సెక్యూరిటీ సిబ్బంది నీలకంఠం, శ్రీకాంత్, వాహన బేరర్లు, శ్రీవారి సేవకులు పాల్గొన్నారు.
#RathaSaptami
#SuryaPrabhaVahanam
#Punganur
#TempleFestival
#SpiritualCelebration
#DevotionalEvent
#AndhraPradesh
#SanatanaDharma
Follow us on
Website
Facebook
Instagram
YouTube