www.ntodaynews.com
సమ్మక్క–సారలమ్మ జాతర పోస్టర్ ఆవిష్కరణ
తెలంగాణ
నంది మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర పోస్టర్ ఆవిష్కరణ
మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ చేతుల మీదుగా
NTODAY NEWS: ధర్మారం
ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలో ఈ నెల 28 నుంచి 31 వరకు వైభవంగా నిర్వహించనున్న సమ్మక్క–సారలమ్మ జాతర మహోత్సవాల పోస్టర్ను ఆదివారం కొప్పుల ఈశ్వర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జాతర కమిటీ సభ్యులు ఆయనను కలిసి ఆహ్వాన పత్రికను అందజేసి జాతర కార్యక్రమాలకు హాజరుకావాలని కోరారు.
అనంతరం కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ, భక్తిశ్రద్ధలతో జరిగే వనదేవతల జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని సూచించారు. గ్రామస్తులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జాతరను విజయవంతం చేయాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు రాసూరి శ్రీధర్, మాజీ ఎంపీటీసీ మిట్ట తిరుపతి, సీనియర్ నాయకులు రాజేందర్, దేవి రమణ, హరీష్, విజయ్, కుమార్, ప్రవీణ్, మల్లేశం, సంజీవ్, నర్సయ్య, రహీం, బొడ్డు నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
#SammakkaSaralammaJatara
#MedaramJatara
#NandiMedaram
#TribalFestival
#TelanganaCulture
#TempleFestival
#DevotionalEvent
#BRSParty
#LocalNews
Follow us on
Website
Facebook
Instagram
YouTube