శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ విగ్రహావిష్కరణలో గౌరవ అతిథిగా పాల్గొన్న
- గడ్డిఅన్నారం డివిజన్ బీజేపీ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి.
NTODAY NEWS: ఎల్బీనగర్ రిపోర్టర్ పగడాల దేవయ్య
సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ తెలంగాణ రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో ఎల్బీనగర్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి గడ్డిఅన్నారం డివిజన్ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి గౌరవ అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి . శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ధర్మం, న్యాయం, సమాజ హితాన్ని కాపాడేందుకు జీవితాంతం పోరాడిన వీరుడని అన్నారు. వారు త్యాగాలు, ఆదర్శాలు ప్రతి ఒక్కరికీ ప్రేరణనిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘ నాయకులు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube