క్రికెట్ లీగ్ జాతరలో పాల్గొన్న సంక్షేమ శాఖ మంత్రి
తెలంగాణ
కోరుట్ల ప్రీమియర్ క్రికెట్ లీగ్ జాతరలో పాల్గొన్న సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్
NTODAY NEWS: గొల్లపల్లి మండలం రిపోర్టర్
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో క్రీస్తు శేషులు జువ్వాడి రత్నాకరరావు జ్ఞాపకార్థంగా ఏర్పాటు చేసిన కోరుట్ల ప్రీమియర్ క్రికెట్ లీగ్ జాతరలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, జిల్లా ఎస్పీ అశోక్, కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు, డీసీసీ అధ్యక్షుడు నందయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ అడువల జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
మంత్రి వ్యాఖ్యలు
ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, క్రీడలు యువతలో శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, సమన్వయం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని తెలిపారు. కోరుట్ల ప్రీమియర్ క్రికెట్ లీగ్ వంటి పోటీలు గ్రామీణ స్థాయిలో క్రీడా ప్రతిభను వెలికితీయడంలో ఎంతో దోహదపడతాయని అన్నారు.
క్రీస్తు శేషులు జువ్వాడి రత్నాకరరావు జ్ఞాపకార్థంగా ఈ లీగ్ను నిర్వహించడం అభినందనీయమని పేర్కొంటూ, యువత చదువుతో పాటు క్రీడల్లోనూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని మంత్రి భరోసా ఇచ్చారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube