రైతుల నీటి కష్టాలపై సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి తక్షణ స్పందన
-క్షేత్రస్థాయిలో ఎస్సార్ఎస్పీ అధికారుల పర్యటన
-సాగునీటి సమస్యల పరిష్కారానికి చర్యలు
-లోత్తునూర్ గ్రామ సర్పంచ్ సుమన్ గౌడ్ వినతి
NTODAY NEWS: గొల్లపల్లి మండలం న్యూస్ రిపోర్టర్
గొల్లపల్లి మండలం లోత్తునూర్ గ్రామం, రైతుల సాగునీటి సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తక్షణమే స్పందించారు. రైతులు ఎదుర్కొంటున్న సాగునీటి ఇబ్బందులను ఫోన్ ద్వారా మంత్రి దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే సంబంధిత ఉన్నతాధికారులను ఆదేశించారు.
మంత్రి ఆదేశాల మేరకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు (SRSP) ఉన్నతాధికారుల బృందం ఈరోజు క్షేత్రస్థాయిలో పర్యటించింది.
క్షేత్రస్థాయిలో అధికారుల పర్యటన
ఎస్సార్ఎస్పీ సీఈ సుమతి ఆదేశాల మేరకు ఎస్ఈ రమేష్, ఈఈ శంకర్, డిఈ ధర్మ, ఏఈ ప్రవీణ్ కుమార్లతో కూడిన అధికారుల బృందం D-53 కెనాల్, ఎస్కేప్ వాగులు మరియు స్థానిక చెరువులను పరిశీలించింది. సాగునీటి సరఫరాలో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలు, కాలువల ప్రస్తుత పరిస్థితిని అధికారులు నిశితంగా పరిశీలించారు.
సమస్యలను వివరించిన గ్రామ సర్పంచ్
లోత్తునూర్ గ్రామ సర్పంచ్ అకుల సుమన్ గౌడ్తో పాటు సీనియర్ నాయకుడు శ్రీనివాసరావు క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారులకు వివరించారు. సాగునీరు సకాలంలో అందక రైతులు నష్టపోతున్నారని పేర్కొంటూ, వెంటనే నీటి విడుదల సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో భాస్కర్, మధు సహా పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సాగునీటి సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.
#FarmersIssues
#IrrigationProblems,
#WaterForFarmers,
#FieldInspection,
#GovernmentResponse,
#SRSP,
#RuralDevelopment,
#AgricultureNews,
#TelanganaNews,
Follow us on
Website
Facebook
Instagram
YouTube