BREAKING
సిఐ చిన్నమల్లయ్యని ఉద్యోగం నుండి శాశ్వతంగా డిస్మిస్ చేస్తూ ఐజి సర్వ శ్రేష్ట త్రిపాఠి ఉత్తర్వులు జారీ.. వెన్నుపోటుకు రెండేళ్లు: కూటమి వైఫల్యాలపై రేపటి నుంచి నిరసనలు లలిత ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్న: ప్రముఖ వైద్యులు కొమ్మినేని వీరశంకర్ రావు,డాక్టర్ రేష్మా డీఎస్సీ అభ్యర్థులకు అండగా నిలిచిన వైయస్ జగన్ నాగార్జున సాగర్ కాలువల నిర్వహణ పనులకు రూ.42.19 కోట్లు మంజూరు అభివృద్ధిలో ప్రజల్ని భాగస్వాముల్ని చేయండి : ప్రత్తిపాటి చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పోస్టర్ ఆవిష్కరణ పల్నాడు జిల్లా స్పెషల్ బ్రాంచ్ సీఐగా సామినేని ఆంథోనీ రాజు బాధ్యతల స్వీకరణ.. యడ్లపాడులో ‘AI ఆధారిత సూపర్ నారి యాప్’ పై వీఓఏలకు శిక్షణ. అభివృద్ధిలో ప్రజల్ని భాగస్వాముల్ని చేయండి : ప్రత్తిపాటి సిఐ చిన్నమల్లయ్యని ఉద్యోగం నుండి శాశ్వతంగా డిస్మిస్ చేస్తూ ఐజి సర్వ శ్రేష్ట త్రిపాఠి ఉత్తర్వులు జారీ.. వెన్నుపోటుకు రెండేళ్లు: కూటమి వైఫల్యాలపై రేపటి నుంచి నిరసనలు లలిత ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్న: ప్రముఖ వైద్యులు కొమ్మినేని వీరశంకర్ రావు,డాక్టర్ రేష్మా డీఎస్సీ అభ్యర్థులకు అండగా నిలిచిన వైయస్ జగన్ నాగార్జున సాగర్ కాలువల నిర్వహణ పనులకు రూ.42.19 కోట్లు మంజూరు అభివృద్ధిలో ప్రజల్ని భాగస్వాముల్ని చేయండి : ప్రత్తిపాటి చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పోస్టర్ ఆవిష్కరణ పల్నాడు జిల్లా స్పెషల్ బ్రాంచ్ సీఐగా సామినేని ఆంథోనీ రాజు బాధ్యతల స్వీకరణ.. యడ్లపాడులో ‘AI ఆధారిత సూపర్ నారి యాప్’ పై వీఓఏలకు శిక్షణ. అభివృద్ధిలో ప్రజల్ని భాగస్వాముల్ని చేయండి : ప్రత్తిపాటి
www.ntodaynews.com

రైతుల నీటి కష్టాలపై సంక్షేమ శాఖ మంత్రి స్పందన

తెలంగాణ
11 Jan, 2026 - 09:52 PM
207 వీక్షణలు

రైతుల నీటి కష్టాలపై సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి తక్షణ స్పందన

-క్షేత్రస్థాయిలో ఎస్సార్ఎస్పీ అధికారుల పర్యటన -సాగునీటి సమస్యల పరిష్కారానికి చర్యలు -లోత్తునూర్ గ్రామ సర్పంచ్ సుమన్ గౌడ్ వినతి NTODAY NEWS: గొల్లపల్లి మండలం న్యూస్ రిపోర్టర్ గొల్లపల్లి మండలం లోత్తునూర్ గ్రామం, రైతుల సాగునీటి సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తక్షణమే స్పందించారు. రైతులు ఎదుర్కొంటున్న సాగునీటి ఇబ్బందులను ఫోన్ ద్వారా మంత్రి దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే సంబంధిత ఉన్నతాధికారులను ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు (SRSP) ఉన్నతాధికారుల బృందం ఈరోజు క్షేత్రస్థాయిలో పర్యటించింది. క్షేత్రస్థాయిలో అధికారుల పర్యటన ఎస్సార్ఎస్పీ సీఈ సుమతి ఆదేశాల మేరకు ఎస్ఈ రమేష్, ఈఈ శంకర్, డిఈ ధర్మ, ఏఈ ప్రవీణ్ కుమార్‌లతో కూడిన అధికారుల బృందం D-53 కెనాల్, ఎస్కేప్ వాగులు మరియు స్థానిక చెరువులను పరిశీలించింది. సాగునీటి సరఫరాలో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలు, కాలువల ప్రస్తుత పరిస్థితిని అధికారులు నిశితంగా పరిశీలించారు. సమస్యలను వివరించిన గ్రామ సర్పంచ్ లోత్తునూర్ గ్రామ సర్పంచ్ అకుల సుమన్ గౌడ్‌తో పాటు సీనియర్ నాయకుడు శ్రీనివాసరావు క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారులకు వివరించారు. సాగునీరు సకాలంలో అందక రైతులు నష్టపోతున్నారని పేర్కొంటూ, వెంటనే నీటి విడుదల సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాస్కర్, మధు సహా పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సాగునీటి సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. #FarmersIssues #IrrigationProblems, #WaterForFarmers, #FieldInspection, #GovernmentResponse, #SRSP, #RuralDevelopment, #AgricultureNews, #TelanganaNews, Follow us on Website Facebook Instagram YouTube