BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 11 March 2026, 07:14 am
Posted by : NTODAY NEWS OFFICIAL

చదువుని మించిన ఆస్తి లేదు

తెలంగాణ
11 Mar, 2026 - 07:14 AM
313 వీక్షణలు

గుల్లకోటలో రూ.10 లక్షలతో నిర్మించిన కిచెన్ షెడ్ల ప్రారంభోత్సవం

NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్

సమాజంలో చదువును మించిన ఆస్తి మరొకటి లేదని, విద్యార్థులు నాణ్యమైన విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. బుధవారం జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామంలోని మండల ప్రజా పరిషత్ పాఠశాల మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించిన కిచెన్ షెడ్లను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు మంత్రికి ఘన స్వాగతం పలికారు.

విద్యే అసలైన ఆస్తి

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇవ్వగలిగే గొప్ప బహుమతి చదువేనని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఎంతోమంది గొప్ప స్థానాలకు ఎదిగిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయని పేర్కొన్నారు.

విద్యారంగానికి ప్రభుత్వం ప్రాధాన్యం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం విద్యారంగానికి ప్రథమ ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని చెప్పారు.

ఉపాధ్యాయులపై కీలక బాధ్యత

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి నాణ్యమైన బోధన అందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని మంత్రి పేర్కొన్నారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పాఠశాలల్లో పెండింగ్‌లో ఉన్న పనులన్నీ పూర్తి చేసి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

గ్రామ అభివృద్ధికి నిధులు

కిచెన్ షెడ్లతో పాటు గుల్లకోట గ్రామంలో రోడ్లు మరియు ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామని మంత్రి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. #AdluriLakshmanKumar #EducationImportance #TelanganaEducation #JagtialDistrict #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube