BREAKING
thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి
Date of Publish : 16 September 2026, 01:35 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరు: అక్రమ కేసును నిరసిస్తూ న్యాయవాదుల విధుల బహిష్కరణ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 Sep, 2026 - 01:35 PM
4 వీక్షణలు

సీనియర్ న్యాయవాదిపై కేసు ఎత్తివేయాలని డిమాండ్‌ ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో నందిగామ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు, సీనియర్ న్యాయవాది బండి మల్లికార్జునరావుపై నమోదు చేసిన కేసును నిరసిస్తూ తిరువూరు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం న్యాయవాదులు విధులను బహిష్కరించారు. ఈ సందర్భంగా న్యాయవాదులు తమ నిరసనను వ్యక్తం చేస్తూ సీనియర్ న్యాయవాదిపై నమోదు చేసిన కేసును వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. న్యాయవాదులు విధులు నిర్వర్తించే సమయంలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం కల్పించేలా ఆంధ్రప్రదేశ్‌లో న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని కోరారు. న్యాయవాదులపై కేసులు నమోదు చేసే విషయంలో సంబంధిత అధికారులు నిబంధనలను పాటించాలని, న్యాయవాదుల హక్కులు, భద్రతకు రక్షణ కల్పించాలని వారు పేర్కొన్నారు. సీనియర్ న్యాయవాది బండి మల్లికార్జునరావుపై నమోదు చేసిన కేసును తక్షణమే ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో మరిన్ని నిరసన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరువూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి గోగిరెడ్డి కృష్ణారెడ్డి, సెక్రటరీ కనపర్తి రామబాబు, సీనియర్ న్యాయవాదులు మాకరాజు రామమోహనరాజు, రాజవరపు శ్రీనివాసరావు, నల్లపాటి సుబ్బారావు, గుండాల భాస్కర్, షేక్ సుభాని, షేక్ గౌస్, రావూరి నాగరాజు, మన్నే వెంకటేశ్వరరావు, కోటేశ్వరరావు, బి. నవీన్, రామారావు తదితరులు పాల్గొన్నారు. న్యాయవాదులపై అక్రమ కేసులు ఎత్తివేయాలని, ఆంధ్రప్రదేశ్‌లో న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే తీసుకురావాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు.