www.ntodaynews.com
విద్యుత్ షాక్తో ఇద్దరు యువకులు మృతి
తెలంగాణ
దండేపల్లిలో విద్యుత్ షాక్తో ఇద్దరు యువకులు మృతి
NTODAY NEWS: మంచిర్యాల ప్రతినిధి వి.శ్రీనివాస్
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని మేదరిపేట వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు విద్యుత్ షాక్కు గురై ప్రాణాలు కోల్పోయారు.
ఎస్సై తహసీద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం, మేదరిపేటలోని ఇండియన్ పెట్రోల్ బంక్ సమీపంలో ఈ ఘటన జరిగింది. స్థానిక సిమెంట్ ట్రేడర్స్లో పనిచేస్తున్న ఇద్దరు యువకులు పెట్రోల్ బంక్ వద్ద ఉన్న ఇనుప స్టాండ్ను తీసుకువెళ్తుండగా అది ప్రమాదవశాత్తు పైన ఉన్న మెయిన్ లైన్ విద్యుత్ తీగలకు తగిలింది.
దీంతో ఒక్కసారిగా విద్యుత్ ప్రవహించి ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతులను మేదరిపేటకు చెందిన సల్లా లక్ష్మీనారాయణ, కాజీపేటకు చెందిన నాగరాజుగా గుర్తించారు.
రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబాలకు చెందిన ఈ యువకుల మృతితో ఆయా గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
#Dandepalli #MancherialDistrict #ElectricShock #AccidentNews #TelanganaNews #NTodayNews
Follow us on
Website
Facebook
Instagram
YouTube