www.ntodaynews.com
ఉచిత బస్సు పథకానికి 10 వేల కోట్లు ఖర్చు: రేవంత్
తెలంగాణ
హైదరాబాద్, జూన్ 9:
ఉచిత బస్సు పథకానికి ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ పథకం ద్వారా పాఠశాలల్లో ఆడపిల్లల డ్రాప్అవుట్ రేటు తగ్గిందని ఆయన పేర్కొన్నారు.
మహిళలను పరిపాలనలో భాగస్వామ్యంగా తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో మహిళా సంఘాల్లో 67 లక్షల మంది సభ్యులున్నారని, మహిళలను పక్కన పెట్టుకుంటే అధికారంలో ఉండలేనని రేవంత్ జోక్యంగా చెప్పారు.
రాష్ట్రాన్ని మహిళా శక్తితో ముందుకు నడిపిస్తున్నామని ఆయన తెలిపారు.