ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన టిడిపి పార్టీ గొల్లప్రోలు టౌన్ అధ్యక్షుడు గుండ్ర సుబ్బారావు.
ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన టిడిపి పార్టీ గొల్లప్రోలు టౌన్ అధ్యక్షుడు గుండ్ర సుబ్బారావు.
గొల్లప్రోలు టిడిపి పార్టీ టౌన్ అధ్యక్షుడు గుండ్ర సుబ్బారావు ఉగాది పండుగ శుభ సందర్భంగా గొల్లప్రోలు ప్రజలకు , నాయకులకు, కార్యకర్తలకు , పేరుపేరునా శుభాకాంక్షలు తెలియజేశారు . గుండ్ర సుబ్బన్న మాట్లాడుతూ ఈ ఉగాది వికార నామ సంవత్సరం. కష్టాలన్నీ తొలగిపోయి, రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కొత్త ఆశలతో ముందుకు సాగుదాం అని టిడిపి పార్టీ టౌన్ అధ్యక్షుడు గుండ్ర సుబ్బారావు పిలుపునిచ్చారు. రానున్న కాలంలో శుభప్రదంగా ఉండాలని ఆకాంక్షిస్తూ పార్టీ శ్రేణులకు, ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడు ప్రజల పక్షాన ఉంటుందని స్పష్టం చేశారు. కార్యకర్తలు, నాయకులు ప్రజల్లో ఉంటూ వారికి అండగా ఉంటామని. తెలుగువారి అభ్యున్నతి కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ శుభవేళ, రాష్ట్రానికి మళ్లీ అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు ఉగాది నవ్యాంధ్ర ప్రజలకు కొత్త ఆశను ఇస్తుందని తెలుగుదేశం పార్టీ గొల్లప్రోలు టౌన్ అధ్యక్షుడు ఆశ భావం వ్యక్తం చేశారు.