BREAKING
ఉమాపాక వేంకన్న ఆలయంలో దొంగతనం.... 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. ఉమాపాక వేంకన్న ఆలయంలో దొంగతనం.... 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు..
www.ntodaynews.com

ఉమాపాక వేంకన్న ఆలయంలో దొంగతనం....

ఆంధ్రప్రదేశ్
/ అనకాపల్లి
Reporter
Bathula venkatesh నక్కపల్లి మండల ప్రతినిధి
08 Jun, 2026 - 08:29 AM
13 వీక్షణలు

అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జూన్ 3, 2026 అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. దుండగులు రెండు హుండీలను పగులగొట్టి లక్షలాది రూపాయల నగదు, బంగారం, వెండిని అపహరించారు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేసి నక్కపల్లి మండలం రేబాకకు చెందిన ఇద్దరు యువకులను అరెస్టు చేశారు. ఆలయంలోని ఆస్థాన మండపం వద్ద, ఆండాళ్లమ్మ సన్నిధిలో ఉన్న రెండు హుండీలను కట్టర్లతో ధ్వంసం చేసి డబ్బును దోచుకెళ్లారు. సుమారు 6 ఏళ్లుగా హుండీ ఆదాయాన్ని లెక్కించకపోవడంతో భారీ మొత్తంలో నగదు అపహరణకు గురైనట్లు అంచనా. పోలీసుల దర్యాప్తు: స్థానిక ఎస్పీ ఆధ్వర్యంలో 6 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. అన్నవరంలో నిందితులను అదుపులోకి తీసుకొని కొంత సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. చోరీకి ముందు వీరు రెక్కీ నిర్వహించినట్లు సీసీ పుటేజీ ద్వారా గుర్తించారు.