www.ntodaynews.com
ఉపాధి హామీ పథకాన్ని పాత విధానంలోనే కొనసాగించాలి: జయరామయ్య
ఆంధ్రప్రదేశ్
రైల్వేకోడూరు: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పాత విధానంలోనే కొనసాగించాలని రైల్వేకోడూరు నియోజకవర్గ వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి జయరామయ్య డిమాండ్ చేశారు. ఓబులవారిపల్లి మండలం సున్నపురాళ్లపల్లె వద్ద కాలువ పనులు చేస్తున్న ఉపాధి కూలీలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఉపాధి హామీ పనుల్లో యంత్రాల వినియోగాన్ని పూర్తిగా నిలిపివేసి, కూలీలకు పూర్తి స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామీణ పేదలకు ఉపాధి హామీ పథకం జీవనాధారంగా ఉందని, కూలీల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పథకాన్ని పాత విధానంలోనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.