BREAKING
సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత
www.ntodaynews.com

ఉపాధి కూలీల సమస్యలు వెంటనే పరిష్కరించాలి: సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
05 Jun, 2026 - 06:03 PM
70 వీక్షణలు

విస్సన్నపేట, జూన్ 5: ఉపాధి హామీ పథకం కూలీల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని సిఐటియు విస్సన్నపేట మండల కన్వీనర్ ఆకుల శ్రీనివాసరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు విస్సంపల్లి నాగరాజు డిమాండ్ చేశారు.

విస్సన్నపేట మండలం వేమిరెడ్డిపల్లి గ్రామపంచాయతీ శివారులోని నర్మదానగర్ ఉపాధి పనుల ప్రాంతాన్ని వారు సందర్శించి కూలీలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆకుల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉపాధి కూలీల హాజరు నమోదుకు అమలు చేస్తున్న రెండు ఫోటోల ఫేస్ యాప్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. విస్సంపల్లి నాగరాజు మాట్లాడుతూ గత ఐదు వారాలుగా పెండింగ్‌లో ఉన్న ఉపాధి కూలీల వేతన బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

అలాగే ఈ-కేవైసీ పూర్తి చేయని కూలీలకు ప్రత్యేకంగా ఈ-కేవైసీ నిర్వహించాలని, పాత బకాయిలను కూడా ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరారు. ఉపాధి పనుల ప్రాంతాల్లో తాగునీరు, నీడ, ప్రథమ చికిత్స వంటి కనీస సౌకర్యాలు కల్పించాలని, కూలీలకు అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని అన్నారు.

ఉపాధి హామీ పథకానికి సంబంధించిన సమస్యలను ప్రభుత్వం త్వరితగతిన పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఉపాధి కూలీలు పాల్గొన్నారు.