BREAKING
MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు
www.ntodaynews.com

ఉపాధి కూలీల సమస్యలు వెంటనే పరిష్కరించాలి: సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
05 Jun, 2026 - 06:03 PM
24 వీక్షణలు

విస్సన్నపేట, జూన్ 5: ఉపాధి హామీ పథకం కూలీల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని సిఐటియు విస్సన్నపేట మండల కన్వీనర్ ఆకుల శ్రీనివాసరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు విస్సంపల్లి నాగరాజు డిమాండ్ చేశారు.

విస్సన్నపేట మండలం వేమిరెడ్డిపల్లి గ్రామపంచాయతీ శివారులోని నర్మదానగర్ ఉపాధి పనుల ప్రాంతాన్ని వారు సందర్శించి కూలీలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆకుల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉపాధి కూలీల హాజరు నమోదుకు అమలు చేస్తున్న రెండు ఫోటోల ఫేస్ యాప్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. విస్సంపల్లి నాగరాజు మాట్లాడుతూ గత ఐదు వారాలుగా పెండింగ్‌లో ఉన్న ఉపాధి కూలీల వేతన బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

అలాగే ఈ-కేవైసీ పూర్తి చేయని కూలీలకు ప్రత్యేకంగా ఈ-కేవైసీ నిర్వహించాలని, పాత బకాయిలను కూడా ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరారు. ఉపాధి పనుల ప్రాంతాల్లో తాగునీరు, నీడ, ప్రథమ చికిత్స వంటి కనీస సౌకర్యాలు కల్పించాలని, కూలీలకు అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని అన్నారు.

ఉపాధి హామీ పథకానికి సంబంధించిన సమస్యలను ప్రభుత్వం త్వరితగతిన పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఉపాధి కూలీలు పాల్గొన్నారు.