BREAKING
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు లోత్తునూరులో వడ్ల ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం పంచాయతీల్లోనూ 5% ఆస్తి పన్ను రాయితీ స్వచ్ఛ సర్వేక్షన్ - స్వచ్ఛ నంద్యాల -కలెక్టర్ రాజకుమారిగనియా జిల్లా కలెక్టర్ ను కలసిన పుంగనూరు జనసేన సీనియర్ నాయకుడు రాయల్ కుమార్... మార్కెట్ యార్డ్ స్థలం రైతులకు అంతా ఉపయోగకరంగా లేదు? నంద్యాల నడి బొడ్డున కోట్ల భూమి ఐఎంఏకు..!! యువత సైబర్ నేరాలు, బెట్టింగ్ మాయాజాలంలో పడవద్దు పాంచజన్యం పేరుతో ఐదు హామీలు ప్రకటించిన కవిత ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఆక్రమణలపై కఠిన చర్యలు ఈ నెల 27న మంచిర్యాల జిల్లాలో ప్రజావాణి రద్దు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు లోత్తునూరులో వడ్ల ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం పంచాయతీల్లోనూ 5% ఆస్తి పన్ను రాయితీ స్వచ్ఛ సర్వేక్షన్ - స్వచ్ఛ నంద్యాల -కలెక్టర్ రాజకుమారిగనియా జిల్లా కలెక్టర్ ను కలసిన పుంగనూరు జనసేన సీనియర్ నాయకుడు రాయల్ కుమార్... మార్కెట్ యార్డ్ స్థలం రైతులకు అంతా ఉపయోగకరంగా లేదు? నంద్యాల నడి బొడ్డున కోట్ల భూమి ఐఎంఏకు..!! యువత సైబర్ నేరాలు, బెట్టింగ్ మాయాజాలంలో పడవద్దు పాంచజన్యం పేరుతో ఐదు హామీలు ప్రకటించిన కవిత ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఆక్రమణలపై కఠిన చర్యలు ఈ నెల 27న మంచిర్యాల జిల్లాలో ప్రజావాణి రద్దు
www.ntodaynews.com

వక్ఫ్ ఆస్తులను ముస్లింల సంక్షేమానికి ఉపయోగించండి

తెలంగాణ
28 Jul, 2025 - 06:51 AM
274 వీక్షణలు
వక్ఫ్ ఆస్తులను ముస్లింల సంక్షేమానికి ఉపయోగించండి NTODAY NEWS: ఇబ్రహీంపట్నం, మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కు అల్తాఫ్ బాబా వినతి, మైలవరం నియోజకవర్గ పరిధిలో ఎన్నో వక్ఫ్ భూములు ఆక్రమణదారుల చేతిలో ఉన్నాయని వాటిని విడిపించి ముస్లింల సంక్షేమానికి ఉపయోగించాలని నియోజకవర్గం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కు విజ్ఞప్తి చేశారు హజ్రత్ సయ్యద్ షాబుఖారి ఆస్థాన పీఠాధిపతులు అల్తాఫ్ బాబా. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ను సోమవారం నాడు గొల్లపూడి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతోమంది ముస్లిం పిల్లలు విద్య అభ్యసించి సరైన ఉద్యోగాలు రాక నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారని, వక్ఫ్ భూములలో వారికి ఉపయోగకరమైన స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు, విద్యాసంస్థలు, ఉపాధి కల్పించే సంస్థలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేను విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) కలిసి ఇదే విషయంపై చర్చించామని ఎమ్మెల్యే కూడా ఈ విషయంపై దృష్టి సారించాలని కోరారు.తప్పకుండా అభివృద్ధికి సహకరించిన ముస్లిం సమాజానికి అండగా ఉంటానని, వారికి అన్ని విధాల ఉపయోగమైన కార్యక్రమాలు నిర్వహించేందుకు తన వంతు కృషి చేస్తారని హామీ ఇచ్చారు వసంత కృష్ణ ప్రసాద్. టిడిపి నాయకులు బొమ్మసాని సుబ్బారావు కార్యక్రమంలో పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube