వాహన సేవకులపై దారుణంగా దాడి చేసిన స్థానికులు.
వాహన సేవకులపై దారుణంగా దాడి చేసిన స్థానికులు.
తిరుపతిలో దారుణం.
వాహన బేరర్లకు, స్థానికుల మధ్య ఘర్షణ.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి వాహనాన్ని మూసి ఇంటికి వెళుతున్న వారిపై మాట మాట పెరిగి ఘర్షణకు దారి తీసిన వైనం.
దాడిలో గాయపడిన చంద్రగిరికి చెందిన వాహన సేవకులు.
అమ్మవారి వాహన సేవ అనంతరం వాహన సేవకులు తమ స్వగ్రామాలకు బయలుదేరిన సమయంలో విపరీతమైన ట్రాఫిక్.
ఈ క్రమంలో ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా రావడంతో మొదలైన వివాదం.
ట్రాఫిక్ ఇబ్బందిగా ఉందని, వాహనాలను పక్కకు జరిపితే తాము వెళ్లిపోతామని టీటీడీ వాహనసేవకులు(మోతగాళ్లు)
కోరగా, స్థానిక వ్యక్తులతో మాట మాట పెరిగి అది ఘర్షణకు దారితీసింది.
తొలుత ముగ్గురు స్థానికులు కలిసి వాహన సేవకులు (మోతగాళ్ల) పైచేయి చేసుకోగా, ఆ తర్వాత సమాచారం అందుకున్న మరో 30 మందికి పైగా స్థానికులు అక్కడికి చేరుకుని విచక్షణారహితంగా దాడి చేశారు.
తాము అమ్మవారి సేవలో పాల్గొని వస్తున్నామని, ఇంటికి వెళ్లడం ఆలస్యమవుతోందని వేడుకున్నప్పటికీ వినకుండా రక్తం వచ్చేలా కొట్టినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం.
ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ముగ్గురు వాహన సేవకులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలింపు.
బాధితుల ఫిర్యాదు మేరకు తిరుచానూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు.
దాడికి పాల్పడిన వారిని గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
భక్తిభావంతో సాగాల్సిన ఉత్సవ సమయంలో ఇలాంటి హింసాత్మక ఘటన చోటు
చేసుకోవడం భక్తులలో మరియు స్థానికులలో తీవ్ర చర్చకు దారితీసింది.