BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

వాహనదారుల భద్రతే ప్రాధాన్యం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
15 Apr, 2026 - 06:16 PM
96 వీక్షణలు

వాహనదారుల భద్రతే ప్రాధాన్యం : రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి NTODAY NEWS చిట్యాల 

రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించి, ప్రయాణికుల భద్రతను మెరుగుపరచడమే లక్ష్యంగా తెలంగాణ పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వేలిమినేడు వద్ద 65 వ నంబర్ జాతీయ రహదారి నల్లగొండ జిల్లా పోలీస్ యంత్రాంగం ఏర్పాటు చేసిన రోడ్డు ప్రమాదాల అవగాహన హోర్డింగ్‌ను రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి బుధవారం ఆవిష్కరించారు. ​ఈ కార్యక్రమంలో డీజీపీతో పాటు డీఐజీ ఎల్.ఎస్. చౌహాన్, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.​హోర్డింగ్ ప్రారంభోత్సవం అనంతరం డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ జాతీయ రహదారులపై నిబంధనలు పాటించకపోవడం వల్లే అత్యధిక ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ల ముఖ్యంగా రాత్రి వేళల్లో గూడ్స్ వాహనాల వల్ల జరిగే ప్రమాదాలను అరికట్టేందుకు ​రేడియం స్టిక్కర్లు తప్పనిసరి అని పేర్కొన్నారు. జాతీయ రహదారిపై ప్రయాణించే ప్రతి గూడ్స్ క్యారియర్ వాహనానికి కస్సాన్ రేడియం స్టిక్కర్లు మరియు రేర్ మార్కింగ్ ప్లేట్స్ కచ్చితంగా ఉండాలని స్పష్టం చేశారు. నిబంధనలు పాటించని వాహనదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్‌ను డీజీపీ ఆదేశించారు వేలిమినేడు సర్పంచ్ బొంతల చంద్రారెడ్డి డీజీపీ శివధర్ రెడ్డిని కలిసి ఒక వినతిపత్రాన్ని సమర్పించారు. జాతీయ రహదారి 65పై ఉన్న పిట్టంపల్లి క్రాస్ వద్ద చీకటి కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, అక్కడ తక్షణమే హైమాస్ట్ లైటింగ్ ఏర్పాటు చేసి వాహనదారుల ప్రాణాలను కాపాడాలని ఆయన కోరారు. దీనిపై డీజీపీ సానుకూలంగా స్పందిస్తూ, సంబంధిత అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో సీఐ నాగరాజు, చిట్యాల ఎస్ఐ రవికుమార్, పోలీసు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు