వాయుగుండం ప్రభావం.. ఏపీలో వర్షాల జోరు
వాయుగుండం ప్రభావం.. ఏపీలో వర్షాల జోరు
పలు జిల్లాలకు వర్ష సూచన.. సముద్రం అల్లకల్లోలం
ఆంధ్రప్రదేశ్పై వాయుగుండం ప్రభావం కొనసాగుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడి జార్ఖండ్ వైపు కదులుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
నేటి నుంచి 23వ తేదీ వరకు కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.
గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండటంతో సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆగస్టు 19 వరకు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు.
ఇప్పటికే అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. హుకుంపేట, పెదబయలు ప్రాంతాల్లో వర్ష ప్రభావం కనిపించింది. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.