వేసవికాలంలో మూగజీవాల కోసం నీటి తొట్టెల ఏర్పాటు
వేసవికాలంలో మూగజీవాల కోసం నీటి తొట్టెల ఏర్పాటు
ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు: మండల పరిధిలోని పలు గ్రామాల్లో వేసవికాలం నేపథ్యంలో మూగజీవాల దాహార్తిని తీర్చేందుకు నీటి తొట్టెలను ఏర్పాటు చేశారు. గ్రామపంచాయతీల సహకారంతో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
వావిలాల, రాజుగూడెం, మునుకొల్ల, వామకుంట్ల, లక్ష్మీపురం, రామన్నపాలెం, కాకర్ల, కోకిలంపాడు, మల్లెల గ్రామాల్లో ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు మరియు పక్షుల కోసం ప్రత్యేకంగా నీటి తొట్టెలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని పశువైద్యాధికారి డాక్టర్ అభిలాష్ స్వయంగా పర్యవేక్షించారు.
వేసవిలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతో మూగజీవాలకు తాగునీటి కొరత ఏర్పడకుండా ముందస్తు చర్యగా ఈ ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. గ్రామస్తులు కూడా ఈ కార్యక్రమానికి సహకరించి, పశువుల సంరక్షణలో భాగస్వాములయ్యారు.