వైఎస్ఆర్సిపి ఎస్సి సెల్ ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా ముల్లంగి జమలయ్య నియామకం
వైఎస్ఆర్సిపి ఎస్సి సెల్ ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా ముల్లంగి జమలయ్య నియామకం
ఏలూరు జిల్లా - నూజివీడు
వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, ఏలూరు జిల్లా ఎస్సి విభాగ కమిటీలో పలు కీలక పదవులు నామినేట్ చేయబడ్డాయి. ఈ క్రమంలో, వైఎస్ఆర్సిపి ఎస్సి సెల్ ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా ముల్లంగి జమలయ్య నియమితులయ్యారు.
ఈ సందర్భంగా జమలయ్య మాట్లాడుతూ, "పార్టీకి ఎన్నో సంవత్సరాలుగా సేవ చేసినందుకు, పార్టీ ఈ పదవి ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నాను" అని పేర్కొన్నారు.
"గత 3 దశాబ్దాలుగా వైఎస్ఆర్సిపి నూజివీడు ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే మేక వెంకట్ ప్రతాప్ అపారావు వంటి నాయకులతో కలిసి పని చేసి, వారి అభిమానాన్ని సంపాదించగలిగాను. ఇది నా జీవితంలో గొప్ప గౌరవం," అని జమలయ్య తెలిపారు.
వైద్య, సామాజిక, రాజకీయ రంగాల్లో వైఎస్ఆర్సిపి పార్టీ పటిష్టత కోసం తన వంతు కృషి అందించి, పార్టీని ముందంజలో ఉంచడానికి నాడు కూడా తన ప్రయత్నాలను కొనసాగించడానికి సంకల్పించారని ఆయన వెల్లడించారు.