వెల్గటూర్ AMC చైర్మన్గా గోళ్ళ తిరుపతి
వెల్గటూర్ AMC చైర్మన్గా గోళ్ళ తిరుపతి
వెల్గటూర్, ఏప్రిల్ 13: వెల్గటూర్ మండలం మత్తునూర్ గ్రామానికి చెందిన ప్రముఖ నాయకులు గోళ్ళ తిరుపతి వెల్గటూర్ మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో నియోజకవర్గ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
సోమవారం ఆయనను మర్యాదపూర్వకంగా కలిసిన పలువురు నాయకులు, ప్రముఖులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతు పక్షపాతిగా, కష్టపడే తత్వం ఉన్న తిరుపతి నియామకం మండల రైతాంగానికి ఎంతో మేలు చేకూరుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
శుభాకాంక్షలు తెలిపిన వారు:
గోళ్ళ తిరుపతి కి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ముఖ్యులు:
మెరుగు నరేష్ (సరయు మొబైల్ & ఆలయ కమిటీ చైర్మన్)
పుదారి రమేష్ (కోటిలింగల ఆలయ చైర్మన్)
గుమ్ముల వెంకటేష్
ఎనగందుల నరేష్
మరియు పలువురు ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువజన సంఘాల నాయకులు ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన నాయకులకు, సహకరించిన మిత్రులకు తిరుపతి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.