BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

వెల్గటూర్‌లో కళ్యాణ లక్ష్మి, CMRF చెక్కుల పంపిణీ..

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
06 Apr, 2026 - 05:02 PM
191 వీక్షణలు

వెల్గటూర్‌లో కళ్యాణ లక్ష్మి, CMRF చెక్కుల పంపిణీ.. లబ్ధిదారులకు అండగా మంత్రి అడ్లూరి

గ్రామాలకు వస్తా.. ప్రజా సమస్యలు పరిష్కరిస్తా: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

​వెల్గటూర్, జగిత్యాల జిల్లా: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పర్యటించి, ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరిస్తానని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు.

​సోమవారం జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎండపల్లి, వెల్గటూర్ మండలాలకు చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి మరియు ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) చెక్కులను మంత్రి పంపిణీ చేశారు.

​కార్యక్రమ ముఖ్యాంశాలు:

​సంక్షేమ ఫలాల పంపిణీ: ఎండపల్లి, వెల్గటూర్ మండలాలకు చెందిన 32 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు.

​వైద్య చికిత్సలు చేయించుకున్న 78 మంది లబ్ధిదారులకు రూ. 25.40 లక్షల విలువైన CMRF చెక్కులను పంపిణీ చేశారు.

​ముగ్గురు దివ్యాంగులకు చేయూతనిస్తూ స్కూటీలను అందజేశారు.

​రాజకీయాలకు అతీతంగా పాలన: ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు ఉండాలని, ప్రజాప్రతినిధులుగా గెలిచిన తర్వాత పార్టీల పట్టింపు లేకుండా అందరి సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా పనిచేయాలని మంత్రి పిలుపునిచ్చారు.

​ఆరు గ్యారంటీల అమలు: రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే నాలుగు గ్యారంటీలను అమలు చేస్తున్నామని, ప్రజా ప్రభుత్వం ప్రజల పక్షాన నిలబడుతుందని ఆయన పేర్కొన్నారు.

​"ధర్మపురి నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి నేనే స్వయంగా వస్తాను. ప్రజా పాలన ద్వారా సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటాం."

— అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి.