BREAKING
ఘనంగా నిర్వహించిన ఆదివాసీల భారీ ర్యాలీ..... గంగా దేవి అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి బోనాల జాతరలో భక్తిశ్రద్ధలతో పాల్గొన్న మాజీ డీసీసీ అధ్యక్షురాలు తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడం కోసం మెగా డీఎస్సీపై వీధి పోరాటాలు విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై రిలే నిరాహార దీక్ష శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం ఐక్యరాజ్యసమితి గుర్తించిన గిరిజనుల హక్కులను పాలకులు ఎందుకు పరిష్కరించడం లేదు? బండిఆత్మకూరు మండలం పార్నపల్లె లో PGRS నిర్వహించిన కలెక్టర్ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో మహిళలు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి: ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మీ శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా ఆడికృత్తిక మహోత్సవం ఘనంగా నిర్వహించిన ఆదివాసీల భారీ ర్యాలీ..... గంగా దేవి అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి బోనాల జాతరలో భక్తిశ్రద్ధలతో పాల్గొన్న మాజీ డీసీసీ అధ్యక్షురాలు తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడం కోసం మెగా డీఎస్సీపై వీధి పోరాటాలు విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై రిలే నిరాహార దీక్ష శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం ఐక్యరాజ్యసమితి గుర్తించిన గిరిజనుల హక్కులను పాలకులు ఎందుకు పరిష్కరించడం లేదు? బండిఆత్మకూరు మండలం పార్నపల్లె లో PGRS నిర్వహించిన కలెక్టర్ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో మహిళలు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి: ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మీ శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా ఆడికృత్తిక మహోత్సవం
www.ntodaynews.com

వెండి ఆభరణాలకూ హాల్‌మార్కింగ్‌ పరీక్షలు!

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
10 Aug, 2026 - 12:31 PM
4 వీక్షణలు

వెండి ఆభరణాలకూ హాల్‌మార్కింగ్‌ పరీక్షలు!  బంగారం ధరల పెరుగుదలతో వెండికి పెరుగుతున్న గిరాకీ

న్యూఢిల్లీ: బంగారం ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారుల దృష్టి వెండి ఆభరణాల వైపు మళ్లుతోంది. ఈ నేపథ్యంలో వెండి ఆభరణాల నాణ్యతను నిర్ధారించే హాల్‌మార్కింగ్‌ పరీక్షలను మరింత విస్తరించేందుకు బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌(బీఐఎస్‌) యోచిస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని సంస్థకు చెందిన ఓ సీనియర్‌ ఉన్నతాధికారి వెల్లడించారు.

బంగారం కొనుగోలు చేసే స్థోమత తగ్గుతున్న కొద్దీ పలువురు వినియోగదారులు ప్రత్యామ్నాయంగా వెండి ఆభరణాలను ఎంచుకుంటున్నారు. దీంతో వెండి ఆభరణాలకు మార్కెట్‌లో డిమాండ్‌ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వెండి స్వచ్ఛత, నాణ్యతపై వినియోగదారులకు మరింత భరోసా కల్పించేందుకు హాల్‌మార్కింగ్‌ విధానాన్ని విస్తరించాలనే అంశాన్ని బీఐఎస్‌ పరిశీలిస్తోంది.

వెండి ఆభరణాలపై హాల్‌మార్కింగ్‌ పరీక్షలు విస్తృతంగా అమలైతే, కొనుగోలుదారులు ఆభరణాల్లోని వెండి స్వచ్ఛతను సులభంగా గుర్తించే అవకాశం ఉంటుంది. అదే సమయంలో నాణ్యత ప్రమాణాలను పాటించేలా వ్యాపారులపై కూడా నియంత్రణ పెరగనుంది. బంగారం మాదిరిగానే వెండి ఆభరణాల విషయంలోనూ నాణ్యతకు ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో బీఐఎస్‌ తీసుకోబోయే నిర్ణయంపై వినియోగదారులు, వ్యాపార వర్గాల్లో ఆసక్తి నెలకొంది.