BREAKING
సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత
www.ntodaynews.com

వెన్నుపోటు కాదు... ప్రజల వెన్నంటి నిలిచిన పాలనకు రెండేళ్లు! పైడిమర్ల కిరణ్ కుమార్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Jun, 2026 - 04:17 PM
87 వీక్షణలు


– పైడిమర్ల కిరణ్ కుమార్ రెడ్డి, ఎన్టీఆర్ జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షులు

2024 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును "వెన్నుపోటు"గా అభివర్ణించడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని ఎన్టీఆర్ జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షులు పైడిమర్ల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ప్రజల ఓటుతో ఏర్పడిన ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ప్రతిపక్షానికి ఉన్నప్పటికీ, ప్రజల తీర్పును వక్రీకరించే హక్కు ఎవరికీ లేదన్నారు.

జగన్ ఇంకా భ్రమల్లోనే జీవిస్తున్నారని, 2024 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చింది సాధారణ ఓటమి కాదని, గత ఐదేళ్ల పాలనలో జరిగిన అవినీతి, అరాచకాలు, ప్రజావ్యతిరేక నిర్ణయాలకు విధించిన చారిత్రాత్మక శిక్ష అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడవలేదని, ఆంధ్రప్రదేశ్ ప్రజలే ఓటుతో గట్టి గుణపాఠం చెప్పారని అన్నారు.

వైసీపీ హయాంలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, ఉద్యోగులు, రైతులు, యువత, విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని ఆరోపించారు. నవరత్నాల పేరుతో రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి, భవిష్యత్తు తరాలపై భారీ ఆర్థిక భారం మోపారని విమర్శించారు. అందుకే ప్రజలు వైసీపీని కేవలం 11 అసెంబ్లీ స్థానాలకు పరిమితం చేశారని పేర్కొన్నారు.

ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభమైన కక్షసాధింపు రాజకీయాలు రాష్ట్రాన్ని అరాచకం, అవినీతి, దోపిడీ వైపు నడిపించాయని అన్నారు. ఇసుక దోపిడి, మద్యం మాఫియా, గంజాయి వ్యవహారాలు, పోలవరం నిర్లక్ష్యం, భూ అక్రమాలు వంటి అంశాలన్నింటినీ ప్రజలు గమనించారని చెప్పారు.

ఇప్పటికీ అబద్ధపు ప్రచారాలు, పుస్తకాల విడుదలల ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తే ఎవరూ నమ్మే పరిస్థితి లేదన్నారు. ప్రజలు ఒకసారి మోసపోవచ్చు కానీ ప్రతిసారి కాదని, 11 సీట్లు ప్రజలు ఇచ్చిన హెచ్చరిక మాత్రమేనని, ఇంకా మార్పు రాకపోతే వైసీపీ భవిష్యత్తు మరింత క్లిష్టంగా మారుతుందని హెచ్చరించారు.

జగన్ తన పాలనపై ఆత్మపరిశీలన చేసుకోవాలని, ప్రజల తీర్పును గౌరవించాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే యజమానులని, వారి తీర్పును అవమానించే వారికి రాజకీయంగా స్థానం ఉండదన్నారు.

కూటమి ప్రభుత్వం చట్టబద్ధంగా, పారదర్శకంగా పాలన సాగిస్తోందని, గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై చట్ట ప్రకారం విచారణ జరుగుతుందని తెలిపారు. ఎవరైనా చట్టానికి అతీతులు కారని, తప్పు చేసిన వారు తప్పించుకోలేరని స్పష్టం చేశారు.

ప్రజలను రెచ్చగొట్టే రాజకీయాలు, అసత్య ప్రచారాలు మానేసి వాస్తవాలను అంగీకరించాలని, లేకపోతే ప్రజల తీర్పు మరోసారి మరింత కఠినంగా ఉంటుందని పైడిమర్ల కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.