BREAKING
గౌడ సంఘం ఏలూరు జిల్లా మహిళా అధ్యక్షురాలిగా మదాసు. చంద్రకళ నియామకం పుంగనూరు లో ఘనంఘ చంద్రబాబు 76వ జన్మదిన వేడుకలు.. జంగారెడ్డిగూడెం హాస్పిటల్ వద్ద మజ్జిగ కేంద్రాన్ని ప్రారంభించిన శాసనసభ్యులు రోషన్ కుమార్ జపాన్‌ను వణికించిన భారీ భూకంపం.. సునామీ హెచ్చరికతో హై అలర్ట్ ఆర్ అండ్ బి అధికారులు పట్టించుకోవడంలేదు చంద్రబాబునాయుడు 76 వ జన్మదిన వేడుకలు రైతు భరోసా: నేడు రెండో విడత నిధులు జమ నోరు ఉందని మాజీ మంత్రి కొప్పుల ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం సరికాదు.. వెల్గటూర్ మండల కేంద్రం లో ఘనంగా టింబర్ డిపో ప్రారంభోత్సవం దండపల్లి మండలంలో దారుణం గౌడ సంఘం ఏలూరు జిల్లా మహిళా అధ్యక్షురాలిగా మదాసు. చంద్రకళ నియామకం పుంగనూరు లో ఘనంఘ చంద్రబాబు 76వ జన్మదిన వేడుకలు.. జంగారెడ్డిగూడెం హాస్పిటల్ వద్ద మజ్జిగ కేంద్రాన్ని ప్రారంభించిన శాసనసభ్యులు రోషన్ కుమార్ జపాన్‌ను వణికించిన భారీ భూకంపం.. సునామీ హెచ్చరికతో హై అలర్ట్ ఆర్ అండ్ బి అధికారులు పట్టించుకోవడంలేదు చంద్రబాబునాయుడు 76 వ జన్మదిన వేడుకలు రైతు భరోసా: నేడు రెండో విడత నిధులు జమ నోరు ఉందని మాజీ మంత్రి కొప్పుల ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం సరికాదు.. వెల్గటూర్ మండల కేంద్రం లో ఘనంగా టింబర్ డిపో ప్రారంభోత్సవం దండపల్లి మండలంలో దారుణం
www.ntodaynews.com

విద్యార్థుల పాలిట వరం: విద్యార్థి మిత్ర పథకం చాట్రాయి ఎంఈఓ 1 మాసగిరి శ్రీనివాస్

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Apr, 2026 - 02:40 PM
40 వీక్షణలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నూతనంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన "డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పథకం" గురించి అవగాహన కల్పించేందుకు పాఠశాల ర్యాలీ నిర్వహించబడింది.

విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభించిన ఈ పథకంలో, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అందించబడే స్టూడెంట్ కిట్ ద్వారా విద్యార్థుల సాధారణ అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వ పెద్దలు ముందుకెళ్లారు. ఈ కిట్‌లో బ్యాగ్, షూస్, తరగతి పుస్తకాలు, వ్రాత పుస్తకాలు, ఏకరూప దుస్తులు, నిఘంటువు, పెన్నులు, జామెంట్రీ బాక్స్ వంటి విద్యాసామగ్రి కలిగి ఉంటుంది.

ఈ పథకం గురించి చాట్రాయి మండల విద్యాశాఖ అధికారి మాసగిరి శ్రీనివాస్ వివరించారు ఆయన విద్యార్థుల తల్లిదండ్రులను కోరుతూ, ప్రైవేటు పాఠశాలలకు తరలించే కంటే అందుబాటులో ఉన్న ప్రభుత్వ పాఠశాలలలో పిల్లలను చేర్చుకుని ఆర్థికంగా మేలు పొందాలని చెప్పారు.

అలాగే, ఈ పథకం కింద "తల్లికి వందనం" పేరిట 13,000 రూపాయలు మూడవ విడతగా కుటుంబం కోసం అందించబడతాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రవీంద్రనాథ్, ఉపాధ్యాయులు పంతగాని వీరకోటి, మరియు ఇతర ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొని విద్యార్థులకు అవగాహన కల్పించారు.

విద్యార్థుల భవిష్యత్తు మెరుగు కోసం ప్రభుత్వ పథకాలు అమలు అవుతూ ఉన్నాయి, ఇవి వారికి ఆర్థికపరమైన సదుపాయాలు అందించడం, పాఠశాలలలో మెరుగైన వాతావరణం కల్పించడం వంటి లక్ష్యాలను చేరుకోవడం ద్వారా తమ లక్ష్యాలను సాధించడానికి వీలుగా ఉంటాయని అన్నారు