విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలి విస్సన్నపేట ఎంఈవో సుధాకర్
విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలి విస్సన్నపేట ఎంఈవో సుధాకర్
వంట ఏజెన్సీలు, ప్రధానోపాధ్యాయులకు ఎంఈఓ ఈ. సుధాకర్ సూచనలు
విస్సన్నపేట: విద్యార్థులకు రుచికరమైన, పౌష్టిక విలువలతో కూడిన ఆహారం అందించాలని విస్సన్నపేట మండల విద్యాశాఖాధికారి ఈ. సుధాకర్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, వంట ఏజెన్సీలను కోరారు.
మండలంలోని ముతరాసిపాలెం ప్రాథమిక పాఠశాలను సందర్శించిన సందర్భంగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకాన్ని పరిశీలించారు. భోజన నాణ్యత, పరిశుభ్రతపై వంట ఏజెన్సీలకు పలు సూచనలు చేశారు.
అనంతరం పాఠశాలలో ఏర్పాటు చేసిన కిచెన్ గార్డెన్ను పరిశీలించారు. అందులో పెంచుతున్న ఆకుకూరలు, కూరగాయల మొక్కలు, పూల మొక్కలను చూసి ఉపాధ్యాయులను అభినందించారు. విద్యార్థులకు పచ్చని వాతావరణం, ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు పెంపొందించడంలో కిచెన్ గార్డెన్లు ఉపయోగపడతాయని తెలిపారు.
పాఠశాల విద్యార్థులు అందరూ చక్కగా చదవడం పట్ల ఎంఈఓ సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి ఉపాధ్యాయులు మరింత కృషి చేయాలని సూచించారు.