www.ntodaynews.com
బీసీలకు 34 శాతం రిజర్వేషన్పై కూటమి నేతల విజయోత్సవ ర్యాలీ
ఆంధ్రప్రదేశ్
/
చిత్తూరు
బీసీలకు 34 శాతం రిజర్వేషన్పై కూటమి నేతల విజయోత్సవ ర్యాలీ
చిత్తూరు: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ ప్రకటించడంపై చిత్తూరు పట్టణంలో కూటమి నాయకులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. చిత్తూరు నగర పాలక సంస్థ చైర్పర్సన్ శ్రీమతి కఠారి హేమలత ఆధ్వర్యంలో కూటమి నాయకులు, కార్యకర్తలు ర్యాలీలో పాల్గొని సంబరాలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పించడం సామాజిక న్యాయానికి మరింత బలం చేకూర్చే నిర్ణయమని అన్నారు. ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. అనంతరం కూటమి నాయకులు, కార్యకర్తలు పరస్పరం స్వీట్లు పంచుకుని విజయోత్సవాన్ని జరుపుకున్నారు.
ర్యాలీలో కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.